దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 28, సోమవారం స్వల్పంగా పడ్డాయి. 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 98,323కి చేరింది. ఇక 100 గ్రాముల(24క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 9,83,230గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ప్రస్తుతం 9,832గా ఉంది.
మరోవైపు 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 90,183గా కొనసాగుతోంది. అదే సమయంలో 100 గ్రాముల(22క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 9,01,830గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 9,018 ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం తగ్గాయి. కోల్కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,035గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,225గా ఉంది. దిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,183 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 98,323గా ఉంది.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,031గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,221గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 90,025గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 98,215గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,039గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,229గా నమోదైంది. విజయవాడలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,045గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,235గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,047గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,237గా ఉంది.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,091గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 98,281గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 90,030గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,220గా ఉంది.
ట్రంప్ టారీఫ్ వ్యవహారం, ఫెడ్ వడ్డీ రేట్లు, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో వెండి ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 10,500గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. రూ. 1,05,000గా కొనసాగుతోంది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 1,15,200 పలుకుతోంది. విజయవాడలో రూ. 1,16,000గా ఉంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 1,05,800.. బెంగళూరులో రూ. 1,04,000గా ఉంది.
సంబంధిత కథనం