ఏప్రిల్​ 28 : హైదరాబాద్​, విజయవాడలో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..-gold and silver prices today 28th april 2025 in hyderabad and vijayawada ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఏప్రిల్​ 28 : హైదరాబాద్​, విజయవాడలో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

ఏప్రిల్​ 28 : హైదరాబాద్​, విజయవాడలో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

Sharath Chitturi HT Telugu

దేశంలో బంగారం ధరలు దిగొచ్చాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (PTI)

దేశంలో బంగారం ధరలు ఏప్రిల్​ 28, సోమవారం స్వల్పంగా పడ్డాయి. 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 98,323కి చేరింది. ఇక 100 గ్రాముల(24క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 9,83,230గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 9,832గా ఉంది.

మరోవైపు 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 90,183గా కొనసాగుతోంది. అదే సమయంలో 100 గ్రాముల(22క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 9,01,830గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 9,018 ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం తగ్గాయి. కోల్​కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,035గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,225గా ఉంది. దిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 90,183 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 98,323గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,031గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,221గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 90,025గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 98,215గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,039గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,229గా నమోదైంది. విజయవాడలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,045గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,235గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,047గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,237గా ఉంది.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 90,091గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 98,281గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 90,030గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,220గా ఉంది.

ట్రంప్​ టారీఫ్​ వ్యవహారం, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్​బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 10,500గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. రూ. 1,05,000గా కొనసాగుతోంది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,15,200 పలుకుతోంది. విజయవాడలో రూ. 1,16,000గా ఉంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 1,05,800.. బెంగళూరులో రూ. 1,04,000గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం