Gold and Silver prices today : మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు- హైదరాబాద్​లో రేట్లు ఇలా..-gold and silver prices today 27th december 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు- హైదరాబాద్​లో రేట్లు ఇలా..

Gold and Silver prices today : మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు- హైదరాబాద్​లో రేట్లు ఇలా..

Sharath Chitturi HT Telugu
Dec 27, 2024 05:29 AM IST

Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. వెండి ధరలు సైతం వృద్ధిచెందాయి. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలు ఇలా..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా. (REUTERS)

దేశంలో బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 వృద్ధి చెంది.. రూ. 77,740కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 77,730గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 7,77,400గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
yearly horoscope entry point

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 71,260కి చేరింది. గురువారం ఈ ధర రూ. 71,250గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 7,12,600కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 7,126గా కొనసాగుతోంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,410గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,890గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,260 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 77,740గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 71,260గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,740గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 71,260గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 77,740గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 71,260గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,740గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 71,310గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 77,790గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 71,260గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,740గా ఉంది.

ఫెడ్​ వడ్డీ రేట్లు​ వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,260గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 92,600గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 91,600గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,00,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 92,600.. బెంగళూరులో రూ. 92,600గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

Whats_app_banner

సంబంధిత కథనం