మే 25 : మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరల వివరాలు..-gold and silver prices today 25th may 2025 in hyderabad and other cities ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మే 25 : మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరల వివరాలు..

మే 25 : మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరల వివరాలు..

Sharath Chitturi HT Telugu

దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు సైతం ఈరోజు మారలేదు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు ఇతర ప్రాంతాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ చూసేయండి..

నేటి బంగారం ధరలు ఇలా..

దేశంలో బంగారం ధరలు మే 25, ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 97,693కి చేరింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 9,76,930కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 9,769గా కొనసాగుతోంది.

మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 89,563కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(22క్యారెట్లు) పసిడి ధర రూ. 8,95,630గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు స్థిరంగా ఉన్నాయి. కోల్​కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,415గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,545గా ఉంది. ముంబైలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,417 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 97,547గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,411గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,541గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 89,405గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 97,535గాను ఉంది.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,419గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,549గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,425గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,555గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,427గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,557గా నమోదైంది.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,471గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 97,601గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 89,410గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,540గా ఉంది.

అమెరికా- చైనా టారీఫ్ వార్​​పై అనిశ్చితి తొలగడం, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. దిల్లీలో 100 గ్రాముల వెండి ధర రూ. 10,300గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 1,03,000కి చేరింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,14,200 పలుకుతోంది. వెండి ధరలు విజయవాడలో రూ.​ 1,15,000.. వైజాగ్​ రూ. 1,12,600గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం