Gold and silver prices today : జులై 23 : దిగొచ్చిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే-gold and silver prices today 23rd july 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : జులై 23 : దిగొచ్చిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే

Gold and silver prices today : జులై 23 : దిగొచ్చిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే

Sharath Chitturi HT Telugu

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు తగ్గాయి. వెండి ధరలు దిగొచ్చాయి. ప్లాటీనం రేట్లు సైతం తగ్గాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (REUTERS)

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు మంగళవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 67,690కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 67,700గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,76,900కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,769గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 73,840కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 73,850గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 7,38,400గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,384గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,840గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,990గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,690 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 73,840గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,240గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,440గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 67,690గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,840గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,690గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,840గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,740గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 73,890గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,690గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,840గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు మంగళవారం తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,140గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 పెరిగి.. రూ. 91,400కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 91,500గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 95,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 91,400.. బెంగళూరులో రూ. 91,450గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు మంగళవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 110 తగ్గి.. రూ. 25,840కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,950గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,840గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం