Gold and Silver prices today : మార్చ్​ 22- దిగొచ్చిన బంగారం, వెండి ధరలు- నేటి రేట్లు ఇలా..-gold and silver prices today 22nd march 2025 in hyderabad and vijayawada ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : మార్చ్​ 22- దిగొచ్చిన బంగారం, వెండి ధరలు- నేటి రేట్లు ఇలా..

Gold and Silver prices today : మార్చ్​ 22- దిగొచ్చిన బంగారం, వెండి ధరలు- నేటి రేట్లు ఇలా..

Sharath Chitturi HT Telugu

Gold and Silver prices today : ఇంతకాలం భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు దిగొస్తున్నట్టు కనిపిస్తున్నాయి. శనివారం, మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ముంబైలోని ఒక జ్యువెల్లరీ షాప్​లో.. (REUTERS)

దేశంలో బంగారం ధరలు శనివారం దిగొచ్చాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 460 తగ్గి.. రూ. 90,235కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 90,695గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 460 దిగొచ్చి.. రూ. 9,02,3500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 9,023గా ఉంది.

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 420 తగ్గి.. రూ. 82,715కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 83,135గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 4200 తగ్గి, రూ. 8,27,150కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 8,271గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 82,863గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 90,383గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 82,715 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 90,235గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 82,711గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 90,231గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 82,705గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 90,225గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 82,719గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 90,415గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 82,725గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 90,245గా నమోదైంది.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 82,771గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 90,291గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 82,710గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 90,230గా ఉంది.

ట్రంప్​ టారీఫ్​ భయాలు, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్​బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 10,680గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 230 తగ్గి.. రూ. 1,06,800కి చేరింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,15,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 1,06,800.. చెన్నైలో రూ. 1,14,600గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం