Gold and silver prices today : స్థిరంగా పసిడి, వెండి ధరలు- నేటి లెక్కలివే..
Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు సైతం మారలేదు. ప్లాటీనం రేట్లు పెరిగాయి. ఆ వివరాలు..
Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 67,800గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,78,000గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ప్రస్తుతం 6,780గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర స్థిరంగా రూ. 73,970గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,39,700గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 7,397గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,950గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,120గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,800 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 73,970గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 68,350గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,570గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 67,800గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,970గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,800గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,970గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,850గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 74,020గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,800గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,970గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,150గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 91,500కి చేరింది. శనివారం కూడా ఇదే ధర పలికింది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 96,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 91,500.. బెంగళూరులో రూ. 91,650గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 10 పెరిగి.. రూ. 25,950కి చేరింది. ఆ ముందు రోజు ధర రూ. 25,940గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,950గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం