ఏప్రిల్​ 21 : పసిడి భగభగ! హైదరాబాద్​లో బంగారం ధర రూ. 97500 పైనే..-gold and silver prices today 21st april 2025 in hyderabad ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఏప్రిల్​ 21 : పసిడి భగభగ! హైదరాబాద్​లో బంగారం ధర రూ. 97500 పైనే..

ఏప్రిల్​ 21 : పసిడి భగభగ! హైదరాబాద్​లో బంగారం ధర రూ. 97500 పైనే..

Sharath Chitturi HT Telugu

దేశంలో బంగారం, వెండి ధరలు సోమవారం తగ్గాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్​తో పాటు దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు.. (REUTERS)

దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గినప్పటికీ, రికార్డు స్థాయిలోనే కొనసాగుతున్నాయి! 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 97,743కి చేరింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 9,77,430గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 9,774గా ఉంది.

మరోవైపు 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 89,613గా కొనసాగుతోంది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 8,96,130గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 8,961 ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,613గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,743గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,465 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 97,595గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,461గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,591గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 89,455గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 97,585గాను ఉంది.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,469గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,599గా నమోదైంది. విజయవాడలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,475గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,605గా నమోదైంది.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,521గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 97,651గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 89,460గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,560గా ఉంది.

ట్రంప్​ టారీఫ్​ హెచ్చరికలు, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్​బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు సోమవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 10,300గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 1,03,000గా కొనసాగుతోంది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,13,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 1,03,800.. బెంగళూరులో రూ. 1,02,000గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం