మే 20 : బిగ్​ రిలీఫ్​- తెలుగు రాష్ట్రాల్లో రూ. 95,500 దిగువకు పసిడి ధరలు- నేటి రేట్లు ఇలా..-gold and silver prices today 20th may 2025 in hyderabad and other cities ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మే 20 : బిగ్​ రిలీఫ్​- తెలుగు రాష్ట్రాల్లో రూ. 95,500 దిగువకు పసిడి ధరలు- నేటి రేట్లు ఇలా..

మే 20 : బిగ్​ రిలీఫ్​- తెలుగు రాష్ట్రాల్లో రూ. 95,500 దిగువకు పసిడి ధరలు- నేటి రేట్లు ఇలా..

Sharath Chitturi HT Telugu

దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా మారలేదు. ఈ నేపథ్యంలో మే 20, మంగళవారం మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

దేశంలో బంగారం ధరలు మే 20, మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 95,293గా కొనసాగుతోంది. ఇక 100 గ్రాముల(24క్యారెట్లు) బంగారం ధర రూ. 9,52,930గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 9,529గా ఉంది.

మరోవైపు 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 87,363గా కొనసాగుతోంది. అదే సమయంలో 100 గ్రాముల(22క్యారెట్లు) పసిడి ధర రూ. 8,73,630గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 8,736గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. కోల్​కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,215గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,145గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,363 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 95,293గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 87,211గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,141గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 87,205గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 95,135గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 87,219గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,149గా నమోదైంది. విజయవాడలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 87,225గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,155గా నమోదైంది. విశాఖపట్నంలో ధరలు వరుసగా.. 87,227గా, 95,157గా కొనసాగుతోంది.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 87,271గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 95,201గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 87,210గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,140గా ఉంది.

ట్రంప్​ టారీఫ్​పై అనిశ్చితి తగ్గడం, ఆర్​బీఐ వడ్డీ రేట్ల కోత, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 10,000గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 1,00,000గా కొనసాగుతోంది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,11,200 పలుకుతోంది. వెండి ధరలు విజయవాడలో రూ.​ 1,12,000.. విశాకపట్నంలో రూ. 1,09,600గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం