Gold and silver prices today : రూ. 58వేలకు చేరువలో పసిడి ధర- పెరిగిన వెండి రేటు..
Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా వృద్ధిచెందాయి. ప్లాటీనం రేట్లు పడ్డాయి. ఆ వివరాలు..
Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 57,910కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 57,900గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 5,79,100కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 5,791గా కొనసాగుతోంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 100 వృద్ధి చెంది.. రూ. 63,170కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 63,160గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 6,31,700గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,060గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,320గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,910 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 63,170గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,410గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,720గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 57,910గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 63,170గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,910గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,170గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,960గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 63,220గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 49,250గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 53,730గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు శనివారం పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,460గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి 74,600కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 74,500గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 76,300 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 74,600.. బెంగళూరులో రూ. 72,100గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు గురువారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 60 తగ్గి.. రూ 23,390కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 24,450గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 23,390గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం