Gold and silver prices today : స్థిరంగా పసిడి ధర, పెరిగిన వెండి రేటు.. నేటి లెక్కిలివే-gold and silver prices today 2 july 2024 in hyderabad bengaluru chennai ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : స్థిరంగా పసిడి ధర, పెరిగిన వెండి రేటు.. నేటి లెక్కిలివే

Gold and silver prices today : స్థిరంగా పసిడి ధర, పెరిగిన వెండి రేటు.. నేటి లెక్కిలివే

Sharath Chitturi HT Telugu

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు పెరిగాయి. ప్లాటీనం రేట్లు పడ్డాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 66,240గా ఉంది. సోమవారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,62,400గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,624గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 72,270 వద్ద కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,22,700గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,227గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,390గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,410గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,240 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,270గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,840గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,920గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,240గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,270గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,240గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,270గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,290గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,310గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,240గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,270గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు ఇలా..

Silver price in Hyderabad : దేశంలో వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,030గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 90,300గా కొనసాగుతోంది. సోమవారం ఈ ధర రూ. 90,200గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 94,800 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 90,300.. బెంగళూరులో రూ. 90,500గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు స్వల్పంగా పడ్డాయి. 10 గ్రాముల ప్లాటీనం ధర రూ. 40 పడి రూ. 26,570గా ఉంది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,570గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం