దేశంలో బంగారం ధరలు జులై 1, మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 97,583గా కొనసాగుతోంది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 9,758గా ఉంది. మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 89,463కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 8,946గా ఉంది.
ఇజ్రాయెల్- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం భారీగా పెరిగి, రూ. 1లక్ష మార్క్ తాకిన 24 క్యారెట్ల బంగారం ధర, ఇప్పుడు రూ. 98వేల మార్క్ దిగువకు చేరుకున్నాయి.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,315 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 97,435గా ఉంది.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,311గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,431గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 89,305గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 97,425గాను ఉంది.
హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,319గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,439గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,325గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,435గా నమోదైంది. విశాఖపట్నంలో ధరలు వరుసగా రూ. 89,327- రూ. 97,447గా ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,371గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 97,491గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 89,310గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,430గా ఉంది.
దేశంలో వెండి ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. దిల్లీలో 100 గ్రాముల వెండి ధర రూ. 11,080గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 1,10,800కి చేరింది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 1,20,900 పలుకుతోంది. విజయవాడలో రేటు రూ. 1,21,700గా ఉంది. విశాఖపట్నంలో 1,19,300గా ఉంది.
సంబంధిత కథనం