Gold and silver prices today : రికార్డు స్థాయి నుంచి దిగొస్తున్న పసిడి ధర- నేటి లెక్కలివే!
Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు సైతం దిగొచ్చాయి. హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో నేటి రేట్ల వివరాలు ఇలా..
Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి.. రూ. 60,370కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 60,380గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,03,700కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 6,037గా కొనసాగుతోంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 తగ్గి.. రూ. 65,860కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 65,870గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 6,58,600గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 60,520గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 66,010గా ఉంది. ఇక కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 60,370 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 65,860గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,890గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,430గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 60,370గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 65,860గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,370గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 65,860గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,420గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 65,910గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 60,370గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 65,860గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేటు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,690గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 76,900గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 77,000గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 79,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 76,900.. బెంగళూరులో రూ. 75,900గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు మంగళవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 220 తగ్గి రూ. 24,720కి చేరింది. క్రితం రోజు ధర రూ. 24,940గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,720గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం