Gold and Silver prices today : దిగొచ్చిన బంగారం, వెండి ధరలు- నేటి రేట్లు ఇలా..
Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు పడ్డాయి. వెండి ధరలు సైతం దిగొచ్చాయి. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశంలో బంగారం ధరలు మంగళవారం తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 110 తగ్గి.. రూ. 89,575కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 87,685గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1100 దిగొచ్చి.. రూ. 8,95,750గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 8,957గా ఉంది.
మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 82,115కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 82,215గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1000 తగ్గి, రూ. 8,21,150కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 8,215గా ఉంది.
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఇలా..
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 82,263గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,723గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 82,115 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 89,575గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 82,111గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 89,571గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 82,123గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 89,583గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 82,119గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 82,579గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 82,125గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 89,587గా నమోదైంది.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 82,171గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 89,631గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 82,110గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 89,570గా ఉంది.
ట్రంప్ టారీఫ్ భయాలు, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు మంగళవరం పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 10,590గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 పడి.. రూ. 1,05,900కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 1,06,000గా ఉండేది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 1,15,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 1,06,700.. బెంగళూరులో రూ. 1,04,900గా ఉంది.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం