Gold and silver prices today : రూ. 68వేలకు చేరువలో పసిడి ధర- వెండి రేటు @93వేలు!-gold and silver prices today 17th may 2024 in hyderabad ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : రూ. 68వేలకు చేరువలో పసిడి ధర- వెండి రేటు @93వేలు!

Gold and silver prices today : రూ. 68వేలకు చేరువలో పసిడి ధర- వెండి రేటు @93వేలు!

Sharath Chitturi HT Telugu
Published May 17, 2024 05:36 AM IST

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు మరింత పెరిగాయి. వెండి ధరలు సైతం వృద్ధి చెందాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 67,860కి చేరింది. గురువారం ఈ ధర రూ. 67,850గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,78,600కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,786గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 వృద్ధి చెంది.. రూ. 74,030కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 74,020గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 7,40,300గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,010గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,180గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,860 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 74,030గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,960గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,414గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 67,860గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 74,030గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,860గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,060గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,910గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 74,080గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,860గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,030గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,920గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 89,200గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 89,100గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 92,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 89,200.. బెంగళూరులో రూ. 88,600గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 100 వృద్ధి చెంది రూ. 28,390 చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 28,290గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 28,390గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

Whats_app_banner

సంబంధిత కథనం