Gold and Silver prices today : గుడ్ న్యూస్- దిగొస్తున్న పసిడి, వెండి ధరలు- నేటి లెక్కలు ఇలా..
Gold and Silver prices today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ నేపథ్యంలోనే మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 86,060గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 86,070గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 8,60,600గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 8,606 ఉంది.
మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 78,890కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 78,900గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 7,88,900గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ప్రస్తుతం 7,889గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 79,040గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,210గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 78,890 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 86,060గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 78,890గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 86,060గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 78,890గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 86,060గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 78,890గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 86,060గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 78,940గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 86,110గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 78,890గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 86,060గా ఉంది.
ట్రంప్ టారీఫ్ హెచ్చరికలు, ఫెడ్ వడ్డీ రేట్లు, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
Silver price in Hyderabad : దేశంలో వెండి ధరలు సోమవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 10,040గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 1,00,400గా కొనసాగుతోంది. ఆదివారం ఈ ధర రూ. 1,00,500గా ఉండేది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 1,07,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 1,00,400.. బెంగళూరులో రూ. 1,00,400గా ఉంది.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం