Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 65,660కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 65,650గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,56,600కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 6,566గా కొనసాగుతోంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 వృద్ధి చెంది.. రూ. 71,630కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 71,620గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 7,16,200గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,810గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,780గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,660 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 71,630గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 65,660గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71630గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 65,660గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 71,630గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 65,660గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,630గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 65,710గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 71,680గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 65,660గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,630గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో వెండి ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,410గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 84,100కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 84,000గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 89,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 84,100.. బెంగళూరులో రూ. 84,100గా ఉంది.
దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 580 పెరిగి.. రూ 25,630కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,050గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,630గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
సంబంధిత కథనం