Gold and silver prices today : మరింత పెరిగిన పసిడి, వెండి ధరలు- నేటి లెక్కలివే..-gold and silver prices today 17th august 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : మరింత పెరిగిన పసిడి, వెండి ధరలు- నేటి లెక్కలివే..

Gold and silver prices today : మరింత పెరిగిన పసిడి, వెండి ధరలు- నేటి లెక్కలివే..

Sharath Chitturi HT Telugu

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా వృద్ధి చెందాయి. ప్లాటీనం రేట్లు కూడా పెరిగాయి. హైదరాబాద్​ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (PTI)

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 65,660కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 65,650గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,56,600కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,566గా కొనసాగుతోంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 వృద్ధి చెంది.. రూ. 71,630కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 71,620గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 7,16,200గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,810గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,780గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,660 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 71,630గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,660గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71630గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 65,660గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 71,630గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,660గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,630గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,710గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 71,680గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 65,660గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,630గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,410గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 84,100కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 84,000గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 89,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 84,100.. బెంగళూరులో రూ. 84,100గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 580 పెరిగి.. రూ 25,630కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,050గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,630గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం