Gold and silver prices today : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు..-gold and silver prices today 16th march 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు..

Gold and silver prices today : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు..

Sharath Chitturi HT Telugu
Published Mar 16, 2024 05:42 AM IST

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పడ్డాయి. వెండి ధరలు సైతం స్వల్పంగా దిగొచ్చాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి.. రూ. 60,590కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 60,600గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,05,900కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,059గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 తగ్గి.. రూ. 66,100కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 66,110గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 6,61,000గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 60,740గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 66,250గా ఉంది. ఇక కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 60,590 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 66,100గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 61,240గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,810గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 60,590గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 66,100గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 60,590గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,100గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 60,640గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 66,150గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 60,590గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,100గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేటు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,690గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 76,900గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 77,000గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 79,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 76,900.. బెంగళూరులో రూ. 76,100గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 290 తగ్గి రూ. 24,690కి చేరింది. క్రితం రోజు ధర రూ. 24,980గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,690గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

Whats_app_banner

సంబంధిత కథనం