Gold and Silver prices today : బంగారం @95,500- తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఇలా..-gold and silver prices today 15th april 2025 in hyderabad and other cities ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : బంగారం @95,500- తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఇలా..

Gold and Silver prices today : బంగారం @95,500- తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఇలా..

Sharath Chitturi HT Telugu

Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు పడ్డాయి. వెండి ధరలు సైతం దిగొచ్చాయి. మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (REUTERS)

దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 160 తగ్గి.. రూ. 95,525కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1600 దిగొచ్చి.. రూ. 9,55,250గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 9,552గా ఉంది.

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 150 దిగొచ్చి.. రూ. 87,565కి చేరింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1500 తగ్గి, రూ. 8,75,650కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 8,756గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,713గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,673గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,565 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 95,525గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 87,561గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,521గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 87,555గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 95,515గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 87,569గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,529గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 87,575గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,535గా నమోదైంది.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 87,621గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 95,581గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 87,560గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,520గా ఉంది.

ట్రంప్​ టారీఫ్​ భయాలు, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు మంగళవారం పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 10,370గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 తగ్గి రూ. 1,03,700కి చేరింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,13,100 పలుకుతోంది. విజయవాడలో రేటు రూ. 1,13,900గా ఉంది. వెండి ధరలు కోల్​కతాలో రూ. 1,03,700.. బెంగళూరులో రూ. 1,01,900గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం