Gold and silver prices today : పసిడి పరుగుకు బ్రేక్- తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేటు ఇలా..
Gold and silver prices today : దేశంలో పసిడి, వెండి ధరల పరుగుకు బ్రేక్ పడింది. ఆదివారం.. బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 66,500గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,65,000గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ప్రస్తుతం 6,650గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 72,550గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,25,500గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 7,255గా ఉంది.
Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,650గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,700గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,500 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 72,550గా ఉంది. ముంబై, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,800గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,960గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 66,500గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,550గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,500గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,550గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,550గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,600గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,500గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,550గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,550గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 85,500గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది.
Silver price today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 89,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ.85,500.. బెంగళూరులో రూ. 86,250గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు ఆదివారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 270 తగ్గి రూ. 26,160కి చేరింది. శనివారం ఈ ధర రూ. 26,430గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,160గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం