జూన్​ 10 : తెలుగు రాష్ట్రాల్లో రూ. 98వేల దిగువకు బంగారం ధర! వెండి రేటు ఎంతంటే..-gold and silver prices today 10th june 2025 in hyderabad and vijayawada other cities ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  జూన్​ 10 : తెలుగు రాష్ట్రాల్లో రూ. 98వేల దిగువకు బంగారం ధర! వెండి రేటు ఎంతంటే..

జూన్​ 10 : తెలుగు రాష్ట్రాల్లో రూ. 98వేల దిగువకు బంగారం ధర! వెండి రేటు ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు సైతం మారలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ చూసేయండి..

మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు.. (REUTERS)

దేశంలో బంగారం ధరలు జూన్​ 10, మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 98,133గా కొనసాగుతోంది. ఇక 100 గ్రాముల(24క్యారెట్లు) బంగారం ధర రూ. 9,81,330కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 9,813గా ఉంది.

మరోవైపు దిల్లీలో 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 89,963కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 8,99,630గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 8,996గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,815 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 97,985గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,811గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,981గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 89,805గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 97,975గాను ఉంది.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,819గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,989గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,825గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,995గా నమోదైంది. విశాఖపట్నంలో ధరలు వరుసగా రూ. 89,827- రూ. 97,997గా ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,871గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 98,041గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 89,810గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,980గా ఉంది.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. దిల్లీలో 100 గ్రాముల వెండి ధర రూ. 11,000గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 1,10,000కి చేరింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,21,200 పలుకుతోంది. విజయవాడలో రేటు రూ. 1,22,000గా ఉంది. విశాఖపట్నంలో 1,19,600గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం