Gold and silver prices today : సెప్టెంబర్​ 1 : స్థిరంగా పసిడి, వెండి ధరలు- నేటి లెక్కలివే!-gold and silver prices today 1 september 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : సెప్టెంబర్​ 1 : స్థిరంగా పసిడి, వెండి ధరలు- నేటి లెక్కలివే!

Gold and silver prices today : సెప్టెంబర్​ 1 : స్థిరంగా పసిడి, వెండి ధరలు- నేటి లెక్కలివే!

Sharath Chitturi HT Telugu

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మారలేదు. ప్లాటీనం రేట్లు భారీగా పతనమయ్యాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 66,950గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,69,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,695గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 73,040గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,30,400గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,304గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం పసిడి రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,100గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,190గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,950 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 73,040గా ఉంది. ముంబై, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,950గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,040గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,950గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,040గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,950గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,040గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,700గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 73,090గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,950గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,040గా ఉంది.

ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్బీఐ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,700గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 87,000గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 92,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 87,000.. బెంగళూరులో రూ. 85,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు ఆదివారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 1000 తగ్గి రూ. 24,300కి చేరింది. శనివారం ఈ ధర రూ. 25,300గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,300గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం