Gold and silver price today : పసిడి ప్రియులకు షాక్- రూ. 59వేలకు చేరువలో బంగారం ధర..!
Gold and silver price today : దేశంలో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం కూడా పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆ వివరాలు..
Gold and silver price today : దేశంలో బంగారం ధరలు మంగళవారం పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 400 పెరిగి.. రూ. 58,850కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 58,450గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 4000 పెరిగి, రూ. 5,88,500కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 5,885గా కొనసాగుతోంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 440 వృద్ధి చెంది.. రూ. 64,200కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 63,760గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 4400 పెరిగి.. రూ. 6,42,200గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 59,000గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,350గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,850 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 64,200గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,750గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 65,180గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 58,850గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 64,200గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,850గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,200గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,900గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 64,250గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 58,850గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,200గా ఉంది.
ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,050గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 80,500గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధరల పలికింది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 83,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 80,500.. బెంగళూరులో రూ. 79,000గా ఉంది.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం