Gold and silver price today : కేజీ వెండి @రూ. 1లక్ష- పసిడి ధర ఎంతంటే..-gold and silver price today 31 may 2024 in hyerabad and telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Price Today : కేజీ వెండి @రూ. 1లక్ష- పసిడి ధర ఎంతంటే..

Gold and silver price today : కేజీ వెండి @రూ. 1లక్ష- పసిడి ధర ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

Gold and silver price today : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పడ్డాయి. వెండి ధరలు సైతం దిగొచ్చాయి. ప్లాటీనం రేట్లు భారీగా పడ్డాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (PTI)

Gold and silver price today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి.. రూ. 66,690కి చేరింది. గురువారం ఈ ధర రూ. 66,700గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 6,66,900కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,669గా కొనసాగుతోంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 72,750కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 72,760గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 తగ్గి.. రూ. 7,27,500గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,840గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,900గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,690 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,750గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,290గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,410గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,690గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,750గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,690గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,750గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,740గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,280గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,690గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,750గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,640గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 96,400కి చేరింది. గురువారం ఈ ధర రూ. 96,500గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,00,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 96,400.. బెంగళూరులో రూ. 95,600గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 700 తగ్గి.. రూ. 27,620కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 28,320గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,620గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం