Gold and silver price today : తగ్గిన పసిడి, స్వల్పంగా పెరిగిన వెండి ధర..-gold and silver price today 28th may 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Price Today 28th May 2023

Gold and silver price today : తగ్గిన పసిడి, స్వల్పంగా పెరిగిన వెండి ధర..

Sharath Chitturi HT Telugu
May 28, 2023 05:46 AM IST

Gold and silver price today : దేశంలో పసిడి ధరలు తగ్గాయి. వెండి ధరలు పెరిగాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా.. (AFP)

Gold and silver price today : దేశంలో బంగారం ధరలు ఆదివారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 దిగొచ్చి రూ. 55,550కి చేరింది. శనివారం ఈ ధర రూ. 55,650గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,55,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 5,555గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 110 తగ్గి రూ. 60,600గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 60,710గా ఉంది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,06,000గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,060గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,650గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,750గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,550 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 60,650గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,940గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,040గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 55,600గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 60,650గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,500గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,600గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,600గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 60,650గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 55,550గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,600గా ఉంది.

ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు ఆదివారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,300గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 పెరిగి రూ. 73,000గా కొనసాగుతోంది. శనివారం ఈ ధర రూ. 72,900గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 77,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 73,000.. బెంగళూరులో రూ. 77,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు ఆదివారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 130 తగ్గి రూ. 27,150కి చేరింది. శనివారం ఈ ధర రూ. 27,280గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,150గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం