Gold and Silver Price Today : తగ్గిన బంగారం ధరలు.. కొనుగోళ్లకు ఇదే మంచి సమయం!
Gold and Silver Price Today : దేశంలో బంగారం ధరలు దిగొచ్చాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆ వివరాలు..
Gold and Silver Price Today : దేశంలో బంగారం ధరలు శనివారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 46,250కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 46,350గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1000 తగ్గి, రూ. 4,62,500కి చేరింది.
ట్రెండింగ్ వార్తలు
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 110 తగ్గి.. రూ. 50,450కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 50,560గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1100 దిగొచ్చి.. రూ. 5,04,500గా ఉంది.
Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,350గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,600గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,250 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 50,450గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,650గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,900గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 46,280గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 50,480గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,250గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,450గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,300గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 50,500గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,250గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,450గా ఉంది.
ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 5,615గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 56,150కి చేరింది. శుక్రవారం కూడా ఇదే ధర ఉంది.
Silver rate today : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 61,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 61,500.. బెంగళూరులో రూ. 56,150గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 620 పెరిగి.. రూ 24,150కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 23,530గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,150గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)