Gold and silver price today : మళ్లీ రూ. 55వేల చేరువకు పసిడి ధర.. స్థిరంగా వెండి!
Gold and silver price today : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆ వివరాలు..
Gold and silver price today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 54,910కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 54,900గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ.100 పెరిగి, రూ. 5,49,100కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 5,491గా కొనసాగుతోంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 వృద్ధి చెంది.. రూ. 59,900కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 59,890గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 5,99,900గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,060గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,910 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 59,900గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,310గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,330గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 54,910గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 59,900గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,910గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,900గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,960గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 59,950గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 54,910గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,900గా ఉంది.
ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి ధర ఇలా..
దేశంలో వెండి ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,470గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. రూ. 74,700గా కొనసాగుతోంది. ఆదివారం కూడా ఇదే ధర పలికింది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 78,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 74,700.. బెంగళూరులో రూ. 73,250గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు సోమవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ 24,760గా ఉంది. ఆ ముందు రోజు కూడా ఇదే ధర పలికింది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,760గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం