Gold and Silver price today : పసిడి ప్రియులకు షాక్​! మళ్లీ రూ. 80వేలు దాటేసిన బంగారం ధర..-gold and silver price today 17th january 2025 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Price Today : పసిడి ప్రియులకు షాక్​! మళ్లీ రూ. 80వేలు దాటేసిన బంగారం ధర..

Gold and Silver price today : పసిడి ప్రియులకు షాక్​! మళ్లీ రూ. 80వేలు దాటేసిన బంగారం ధర..

Sharath Chitturi HT Telugu
Jan 17, 2025 05:49 AM IST

Gold and Silver price today : దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి రేట్లు కూడా పెరిగాయి. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోవాలి.

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (REUTERS)

దేశంలో బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 వృద్ధి చెంది.. రూ. 80,630కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 80,620గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 8,06,300గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 73,910కి చేరింది. గురువారం ఈ ధర రూ. 73,900గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 7,39,100కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 7,391గా కొనసాగుతోంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 74,060గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,780గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 73,910 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 80,630గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 73,910గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 80,630గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 73,910గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 80,630గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 73,910గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 80,630గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 73,960గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 80,680గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 73,910గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 80,630గా ఉంది.

ఫెడ్​ వడ్డీ రేట్లు​ వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,560గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 95,600గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 95,500గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,03,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 95,600.. బెంగళూరులో రూ. 95,600గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

Whats_app_banner

సంబంధిత కథనం