భారత్-పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మంగళవారం స్టాక్ మార్కెట్లో డిఫెన్స్ స్టాక్స్ భారీ ర్యాలీ ని చూస్తున్నాయి. ముఖ్యంగా హెచ్ఏఎల్, మజగావ్ డాక్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ తదితర రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీల షేర్లు 4 నుంచి 14 శాతం వరకు లాభపడ్డాయి. యుద్ధ సమయాల్లో సైనిక పరికరాలకు పెరిగే డిమాండ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం పెరిగే అవకాశం ఉందనే అంచనాలే ఈ ర్యాలీకి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
డిఫెన్స్ స్టాక్ లో మంగళవారం గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ షేరు ధర అత్యధికంగా లాభపడింది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ షేరు ధర ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.2020కి పెరిగింది. ఇది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ షేరు ధర కోసం మునుపటి రోజుల ముగింపు స్థాయిలతో పోలిస్తే 15% కంటే ఎక్కువ.
మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ షేరు ధర ఇతర కీలక గెయినర్లలో ఒకటి. మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ షేరు ధర దాదాపు 9 శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి రూ.3035కు చేరుకుంది. గత ఏడాది మేలో 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.1035ను చూసిన మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ షేరు ధర ఇప్పుడు తన పెట్టుబడిదారులకు మంచి లాభాలను చూపుతోంది.
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ షేరు ధర 5% కంటే ఎక్కువ పెరిగింది. ఇది ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ .4660 కు చేరుకుంది. ఇది దాదాపు 15% పైగా లాభాలను ఇచ్చింది. మరో 26 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వస్తున్న వార్తలతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ షేరు ధరలు పెరుగుతున్నాయి. భారత్ డైనమిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్ల ధరలు ఇంట్రాడేలో సుమారు 4 శాతం చొప్పున లాభపడ్డాయి.
‘భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో డిఫెన్స్ స్టాక్స్ పుంజుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఒకవేళ యుద్ధం జరిగితే, అది 2-4 వారాలకే పరిమితమైనప్పటికీ, ఆయుధాలు, మందుగుండు సామగ్రి సహా అన్ని రక్షణ పరికరాలకు డిమాండ్ గణనీయంగా ఉంటుంది. ఇది రక్షణ ఉత్పత్తుల సంస్థలకు గణనీయమైన ఆర్డర్లు రావడానికి దారితీస్తుంది’ అని ఓమ్నిసైన్స్ క్యాపిటల్ సీఈఓ, చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వికాస్ గుప్తా వివరించారు.
సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవి. హెచ్ టీ తెలుగు వి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.
సంబంధిత కథనం