రూ.39 వేలకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 112 కి.మీ, లైసెన్స్ అవసరం లేదు-checkout best affordable electric scooter ola gig price battery range and other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  రూ.39 వేలకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 112 కి.మీ, లైసెన్స్ అవసరం లేదు

రూ.39 వేలకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 112 కి.మీ, లైసెన్స్ అవసరం లేదు

Anand Sai HT Telugu

అతి తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవారి కోసం ఓలా మంచి ఆప్షన్ అందిస్తోంది. ఓలా గిగ్ స్కూటర్‌ను తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు.

ఓలా గిగ్ ఎలక్ట్రిక్ స్కూటర్

చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా గిగ్ కేవలం రూ.39,999కే దొరుకుతుంది. తక్కువ ధర, లైసెన్స్ లేని వాహనం కావాలనుకునే వారికి ఇది అనువైనది. ఈ స్కూటర్‌కు రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ అవసరం లేదు. కళాశాల విద్యార్థులు, సీనియర్ సిటిజన్లకు ఇది మంచి ఎంపిక. 250W మోటార్, 1.5 kWh బ్యాటరీ, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 112 కి.మీ.ల రేంజ్ కలిగి ఉంటుంది. గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. 4-5 గంటల్లో ఛార్జ్ అవుతుంది.

లైసెన్స్ అవసరం లేదు

ఓలా గిగ్‌కు లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇది తక్కువ వేగంతో నడిచే వాహనం కాబట్టి ఆర్టీఓ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది విద్యార్థులు, సీనియర్ సిటిజన్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని సులభంగా ఉపయోగించవచ్చు. తక్కువ నిర్వహణ ఖర్చు ఉంటుంది. రోజువారీ ప్రయాణానికి మంచిది.

గిగ్ స్కూటర్‌లో ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. డిజిటల్ స్పీడోమీటర్, పుష్-బటన్ స్టార్ట్ ఉంది. సీటు కింద మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, యాంటీ-థెఫ్ట్ అలారం, నిల్వ ఉన్నాయి. రోజువారీ ప్రయాణికులు, రెండో వాహనం కోసం చూస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ స్కూటర్‌ను పట్టణ ట్రాఫిక్, గ్రామీణ ప్రాంతాల్లో సులభంగా నడపవచ్చు.

ధర

రూ.39,999 ధరతో ఓలా వెబ్‌సైట్‌లో బుకింగ్‌లు చేసుకోవచ్చు. ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీరు చాలా చౌకైన స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే ఓలా కొత్త స్కూటర్ మీకు బెటర్ ఆప్షన్.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.