Gold rate today in Hyderabad : దేశంలో బంగారం ధరలు ఆదివారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 150 పెరిగి.. రూ. 52,650కి చేరింది. శనివారం ఈ ధర రూ. 52,500గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1500 పెరిగి, రూ. 5,26,500కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 5,265గా కొనసాగుతోంది.,మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 170 వృద్ధి చెంది.. రూ. 57,440కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 57,270గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1700 పెరిగి.. రూ. 5,74,400గా ఉంది.,Gold and Silver rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,800గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,590గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,650 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 57,440గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.,కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 53,500గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 58,370గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 52,650గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 57,440గాను ఉంది.,Gold rate today in Vijayawada : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,650గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,440గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.,అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,700గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 57,490గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 52,650గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,440గా ఉంది.,ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.,వెండి కూడా..దేశంలో వెండి ధరలు ఆదివారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,220గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 400 తగ్గి రూ. 72,200గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 72,600గా ఉండేది.,Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 74,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 72,200.. బెంగళూరులో రూ. 74,200గా ఉంది.,ప్లాటీనం ధరలు ఇలా..దేశంలో ప్లాటీనం రేట్లు ఆదివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 80 పెరిగి.. రూ. 26,500కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 26,420గా ఉండేది.,ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,500గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.,(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.),