75 rupee coin to launch soon : త్వరలోనే రూ. 75 కాయిన్​ లాంచ్​..-centre issues notice to mint 75 rupee coin to mark new parliament building launch ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Centre Issues Notice To Mint 75 Rupee Coin To Mark New Parliament Building Launch

75 rupee coin to launch soon : త్వరలోనే రూ. 75 కాయిన్​ లాంచ్​..

Sharath Chitturi HT Telugu
May 26, 2023 07:46 AM IST

75 rupee coin to launch soon : త్వరలోనే రూ. 75 కాయిన్​ లాంచ్​ అవ్వనుంది. ఈ విషయం కేంద్రం వెల్లడించింది.

నూతన పార్లమెంట్​ భవనం..
నూతన పార్లమెంట్​ భవనం.. (PTI)

75 rupee coin to launch soon : నూతన పార్లమెంట్​ భవనం ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించాలని తలపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. కొత్త పార్లమెంట్​ భవనం ఓపెనింగ్​ను ఉద్దేశించి.. రూ. 75 కాయిన్​ను లాంచ్​ చేయాలని నిర్ణయించింది. ఈ రూ. 75 కాయిన్​ త్వరలోనే మార్కెట్​లోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

75 రూపాయిలు విలువ చేసే ఈ నాణెం బరువు 35గ్రాములు. 50శాతం వెండి, 40శాతం రాగి, 5శాతం నికెల్​, 5శాతం జింక్​తో దీనిని తయారు చేయనున్నారు. దీని డయామిటర్​ (వ్యాసం) 44ఎంఎంలు.

RS 75 coin : కాగా.. ఈ కాయిన్​ డిజైన్​పై ప్రత్యేక దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. ఆశోక స్తంభంపై ఉండే నాలుగు సింహాల చిహ్నం ఇందులో ఉండనుంది. ఈ లయన్​ క్యాపిటల్​ కింద 'సత్యమేవ జయతే' అని రాసి ఉంటుంది. ఎడమవైపు.. 'భారత్​' అన్న పదం దేవనగరి లీపిలో రాసి ఉంటుందని తెలుస్తోంది. కుడివైపు ఆంగ్లంలో 'ఇండియా' అని రాసి ఉండనుంది. కాగా.. ఈ కాయిన్​పై రూపీ సింబల్​తో పాటు డినామినేషన్​ వాల్యూగా 75 ఉండనుంది. లయన్​ క్యాపిటల్​ కింద ఇవి ఉండనున్నాయి. కాయిన్​ ఎగువ అంచుపై 'సంసద్​ సంకుల్​' అని దేవనగరి స్క్రిప్ట్​లో, దిగువ అంచున 'పార్లమెంట్​ కాంప్లెక్స్​' ఉండనున్నాయి.

ఈ రూ. 75 విలువ చేసే నాణేనికి సంబంధించి రానున్న రోజుల్లో మరింత సమాచారం తెలుస్తుంది.

ప్రస్తుతం మార్కెట్​లో రూ. 1, రూ. 2, రూ. 5 విలువ చేసే కాయిన్లు ఎక్కువగా వాడకంలో ఉన్నాయి. గతంలో రూ. 10ని ఆర్​బీఐ లాంచ్​ చేసినప్పటికీ.. వాటి వాడకం తగ్గిపోయింది!

నూతన పార్లమెంట్​ భవనం..

New Parliament building opening : ఈ నెల 28న నూతన పార్లమెంట్​ భవనాన్ని ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ వేడుకకు 25పార్టీలు హాజరయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో 20 విపక్ష పార్టీలు ఈ వేడుకలను బహిష్కరించాయి. ఈ వ్యవహారంపై ఎన్​డీఏ- విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. పార్లమెంట్​ భవనాన్ని మోదీ ప్రారంభించడమేంటి? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వేడుకులను బహిష్కరించాలన్న విపక్షాల నిర్ణయం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఎన్​డీఏ పక్షాలు మండిపడుతున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం