12 రాష్ట్రాల్లో 5738 పీఎం ఈ బస్సులు.. మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు!-central govt approves 5738 pm electric busses in 12 states operations will start in 2025 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  12 రాష్ట్రాల్లో 5738 పీఎం ఈ బస్సులు.. మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు!

12 రాష్ట్రాల్లో 5738 పీఎం ఈ బస్సులు.. మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు!

Anand Sai HT Telugu
Jan 12, 2025 02:28 PM IST

PM E Bus Seva : ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై వైపు కేంద్రం చొరవ చూపిస్తుంది. ఈ మేరకు ప్రయత్నాలు చేస్తోంది. పీఎం ఈ-బస్సులకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం చర్యలు తీసుకుంటోంది.

పీఎం ఈ-బస్సు సర్వీసులు
పీఎం ఈ-బస్సు సర్వీసులు

పీఎం ఇ-బస్సులకు అవసరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి 66 నగరాల్లో మీటర్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వెనుక రూ. 884 కోట్లు మంజూరు అయ్యాయి. వీటిలో రూ. 438 కోట్లు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఇచ్చారు. ఇది కాకుండా PM e-బస్సులలో ఆటోమేటిక్ ఛార్జీల సేకరణ వ్యవస్థ కోసం కూడా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.

yearly horoscope entry point

పీఎం ఈ-బస్ సేవ కింద ఈ సంవత్సరం ప్రారంభంలో వందకు పైగా నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సుల ఆపరేషన్ ప్రారంభమవుతుంది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 77 నగరాల నుంచి వచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ నగరాల నుంచి ఇప్పటి వరకు 5738 బస్సుల ప్రతిపాదనలు అందాయి. చాలా చోట్ల టెండర్లు వేశారు. ప్రధానమంత్రి ఈ-బస్ సర్వీస్ ద్వారా పట్టణ ప్రాంతాల్లో రవాణా మౌలిక సదుపాయాలను కొత్త పద్ధతివైపు తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోందని కేంద్ర పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి తోఖాన్ సాహు చెప్పారు.

ఈ పథకం కింద పది వేల ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చేందుకు ఇరవై వేల కోట్ల రూపాయల కేంద్ర సహాయం అందించనుంది. ఈ పథకం మార్చి 2037 వరకు అమలులో ఉంటుంది. పట్టణ అభివృద్ధి దృష్ట్యా ఈ పథకం చాలా ముఖ్యమైనదని, ఎందుకంటే దీని కింద బస్ డిపోల అభివృద్ధి, ఆధునీకరణ, అర్హత ఉన్న నగరాల్లో ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం కూడా సహాయం అందించనున్నట్టుగా సాహు చెప్పారు.

ఈ-బస్సులు ఆమోదించిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, పంజాబ్, ఒడిశా, బీహార్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, అస్సాం వంటి రాష్ట్రాలు ఉన్నాయి. అదే విధంగా నగరాలు చూసుకుంటే.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్, కోర్బా, రాయ్‌పూర్, గయా, పూర్నియా, భాగల్‌పూర్, ముజఫర్‌పూర్, బీహార్‌లోని పాట్నా, అజ్మీర్, భిల్వారా.. రాజస్థాన్‌లోని ఉదయపూర్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, ఉల్హాస్‌నగర్, మహారాష్ట్రలోని అకోలా, కొల్హాపూర్, గుజరాత్‌లోని రూర్కేలా, ఒడిశాలోని భావ్‌నగర్, మధ్యప్రదేశ్‌లోని గాంధీనగర్, జామ్‌నగర్, రాజ్‌కోట్, వడోదర, భోపాల్, ఉజ్జయిని.. నగరాలు ఉన్నాయి. బస్ డిపోల నిర్మాణం, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ పథకం రెండో దశలో గ్రీన్ అర్బన్ మొబిలిటీ ప్రాజెక్టులకు కేంద్ర సాయం అందించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇది బస్సు సర్వీసులకు అనుబంధ పథకంగా ఉంటుంది. ఇది కాకుండా PM e-బస్సులలో ఆటోమేటిక్ ఛార్జీల సేకరణ వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.

Whats_app_banner