10 నిమిషాల్లో భూమిని కొనుగోలు చేయవచ్చు.. రియల్ ఎస్టేట్‌ రంగంలోకి కొత్త కాన్సెప్ట్‌తో జెప్టో!-buy land in 10 minutes zepto adds realty to quick commerce offerings know in details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  10 నిమిషాల్లో భూమిని కొనుగోలు చేయవచ్చు.. రియల్ ఎస్టేట్‌ రంగంలోకి కొత్త కాన్సెప్ట్‌తో జెప్టో!

10 నిమిషాల్లో భూమిని కొనుగోలు చేయవచ్చు.. రియల్ ఎస్టేట్‌ రంగంలోకి కొత్త కాన్సెప్ట్‌తో జెప్టో!

Anand Sai HT Telugu

క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్‌తో వచ్చింది. కేవలం పది నిమిషాల్లోనే భూమిని కొనుగోలు చేయవచ్చని చెబుతుంది. అయితే ఇది ఒక్క ప్రాజెక్ట్ వరకేనా.. లేదంటే భవిష్యత్తులోనూ రియల్ ఎస్టేట్‌ రంగంలో కొనసాగుతుందా? తెలియాల్సి ఉంది.

జెప్టో

భూమి లేదా ప్లాట్ కొనడం చాలా బిజీ ప్రక్రియ, చాలా నెలలు పడుతుంది. కానీ ఇప్పుడు మీరు కేవలం 10 నిమిషాల్లో భూమిని కొనుగోలు చేయవచ్చు. అవును మీరు విన్నది నిజమే. వాస్తవానికి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టింది. దీని కింద వినియోగదారులు కేవలం 10 నిమిషాల్లో ఆన్‌లైన్ ప్లాట్లను కొనుగోలు చేయవచ్చు.

జన్మాష్టమి 2025 సందర్భంగా అభినందన్ లోధా కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని ప్రకటిస్తూ ఓ యాడ్‌ను విడుదల చేసింది జెప్టో. తన ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులు కేవలం 10 నిమిషాల్లో ప్లాట్‌ను పొందవచ్చని ప్రకటనలో చూపించారు. స్థలం, విస్తీర్ణం, ధర, లీగల్ డాక్యుమెంట్లు వంటి భూమికి సంబంధించిన అన్ని సమాచారం ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా లభిస్తుందని, తద్వారా కొనుగోలుదారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్లాట్‌ను డిజిటల్‌గా బుక్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

సుదీర్ఘ ప్రక్రియలకు బదులుగా వేగవంతమైన, నమ్మదగిన వాటి కోసం చూస్తున్న వారిని దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్‌న ప్రత్యేకంగా తీసుకువచ్చారు. రియల్ ఎస్టేట్ మార్కెట్లో పారదర్శకత, సమయం ఆదాకు మంచి డిమాండ్ ఉందని జెప్టో అభిప్రాయపడింది. అందుకే హౌస్ ఆఫ్ అభినందన్ లోధాతో ఒప్పంద కుదుర్చుకుంది. ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా భూముల కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా యువత, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వినియోగదారులను ఆకట్టుకునేలా చేస్తోంది.

ఈ మోడల్ విజయవంతమైతే ఆన్‌లైన్ ప్రాపర్టీ క్రయవిక్రయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని, రానున్న కాలంలో ఇతర కంపెనీలు కూడా ఇలాంటి సేవలను ప్రారంభించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అభినందన్ లోధా కుటుంబం(హెచ్ఓఏబీఎల్)తో కలిసి జెప్టో ప్లాట్‌ఫామ్‌పై కేవలం 10 నిమిషాల్లో ఒక ప్లాట్‌ను సొంతం చేసుకునే ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చింది. బృందావనంలో ప్లాట్లను 10 నిమిషాల్లో కొనుగోలు చేయవచ్చని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ యాడ్ క్యాంపెయిన్ నిర్వహించింది.

అలీబాగ్, డాపోలి, గోవా, అయోధ్య వంటి ప్రాంతాల్లో ప్రీమియం ప్లాట్లను అభివృద్ధి చేయడంలో హెచ్ఓఏబీఎల్ ప్రసిద్ధి చెందింది. అలీబాగ్ లోని 'ది శాంక్చురీ', అయోధ్యలో ప్రీమియం ప్లాట్ కొన్ని ప్రసిద్ధ ప్రాజెక్టులు ఉన్నాయి. హెచ్ఓఏబీఎల్ సహకారంతో జెప్టో క్యాంపెయిన్ ముఖ్యంగా బృందావన్లో ప్లాట్లను ప్రోత్సహిస్తుంది. అయితే జెప్టో HoABL ప్లాట్లను మాత్రమే ప్రమోట్ చేస్తుందా లేదా భవిష్యత్తులో ఇతర రియల్ ఎస్టేట్ కంపెనీలతో కలిసి పనిచేస్తుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.