Union Budget 2025 Live Updates : రూ. 12లక్షల వరకు నో ట్యాక్స్..
- Budget 2025 Live Updates : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 'బడ్జెట్ 2025'ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని ఈ హెచ్టీ తెలుగు లైవ్ పేజ్తో తెలుసుకోండి..
Sat, 01 Feb 202509:22 AM IST
బడ్జెట్ పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ బడ్జెట్ భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఒక కీలక మైలురాయి అని అన్నారు. 'భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఈ రోజు ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల బడ్జెట్. ప్రతి భారతీయుడి కలలను సాకారం చేసే బడ్జెట్ ఇది. యువత కోసం అనేక రంగాలను తెరిచాం. వికసిత్ భారత్ మిషన్ ను సామాన్య పౌరుడు నడపబోతున్నాడు' అని ఆయన ఓ వీడియో ప్రకటనలో పేర్కొన్నారు.
Sat, 01 Feb 202509:03 AM IST
ఆదాయ పన్ను స్లాబ్ ల్లో మార్పులతో ప్రయోజనాలు ఇవిగో..
025-26 బడ్జెట్లో సవరించిన శ్లాబులతో మధ్యతరగతికి ఉపశమనం లభించింది. రూ.12 లక్షల లోపు వార్షికాదాయానికి కొత్త ఆదాయపు పన్ను విధానంలో ఐటీ నుంచి మినహాయింపు ఉంటుంది. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులకు రూ.80,000 పన్ను ప్రయోజనం లభిస్తుంది. రూ.18 లక్షల ఆదాయం ఉన్న వారికి రూ.70,000 పన్ను మినహాయింపు లభిస్తుంది. రూ.25 లక్షల ఆదాయం ఉన్న వారికి రూ.1.10 లక్షల బెనిఫిట్ లభిస్తుంది.
Sat, 01 Feb 202508:19 AM IST
బడ్జెట్ అందించిన ఊపుతో భారీగా పెరిగిన ఫిషరీస్ స్టాక్స్
కేంద్ర బడ్జెట్లో మత్స్య రంగానికి ఊతమిచ్చేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేయడంతో స్టాక్ మార్కెట్లో ఫిషరీస్ స్టాక్స్ కు ఊపు వచ్చింది. ముక్కా ప్రోటీన్స్ ఇంట్రాడేలో 12 శాతానికి పైగా పెరిగి రూ.41.08 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆక్వా కూడా 9.6 శాతం పెరిగి రూ.13.70 వద్ద గరిష్టాన్ని తాకింది. అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్, వాటర్బేస్ ఇండెక్స్ షేర్లు 8.4 శాతం పెరిగి వరుసగా రూ.271.70, రూ.75.40 వద్ద ముగిశాయి. అవంతి ఫీడ్స్ కూడా 7.7 శాతం పెరిగి రూ.762 వద్ద, గోద్రేజ్ ఆగ్రోవేట్ 7.2 శాతం పెరిగి రూ.782 వద్ద ముగిశాయి. అండమాన్ నికోబార్, లక్షద్వీప్ లో మత్స్య రంగాన్ని బలోపేతం చేసి వృద్ధి, సుస్థిరతకు తోడ్పడాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదనంగా, 7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు మరియు పాడి రైతులకు స్వల్పకాలిక రుణాలను అందించడానికి కిసాన్ క్రెడిట్ కార్డులు (కెసిసి) కొనసాగించనున్నారు.
Sat, 01 Feb 202508:16 AM IST
బడ్జెట్ తరువాత భారీగా పడిన రైల్వే స్టాక్స్; కారణం ఏంటంటే?
ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత ఫిబ్రవరి 1, శనివారం ఇంట్రాడే ట్రేడింగ్ లో మెజారిటీ రైల్వే స్టాక్స్ పడిపోయాయి. అంచనాలకు భిన్నంగా కేంద్ర బడ్జెట్ లో రైల్వే షేర్లకు సంబంధించి ఎలాంటి నిర్దిష్ట ప్రకటనలు చేయకపోవడం ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి (2026 ఆర్థిక సంవత్సరం) మూలధన వ్యయం గత ఏడాది కంటే 10 శాతం పెరిగి రూ .11.2 లక్షల కోట్లకు చేరుకున్నప్పటికీ, రైల్వే రంగానికి కేటాయింపులు మారలేదు.
Sat, 01 Feb 202507:53 AM IST
నిర్మల బడ్జెట్ ప్రసంగం ప్రత్యేకతలు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం వరుసగా ఎనిమిదో కేంద్ర బడ్జెట్ ప్రసంగం చేశారు. ఈ సంవత్సరం ఆమె బడ్జెట్ ప్రసంగం 1 గంట 14 నిమిషాల పాటు సాగింది. 2020లో ఆమె బడ్జెట్ ప్రసంగం అత్యధిక సమయం కొనసాగింది. ఆ సంవత్సరం బడ్జెట్ సమర్పణ సందర్భంగా నిర్మల సీతారామన్ రెండు గంటల 40 నిమిషాల పాటు ప్రసంగించారు. 2024 ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 56 నిమిషాల పాటు ప్రసంగించారు.
Sat, 01 Feb 202507:08 AM IST
అద్దెపై టీడీఎస్ పరిమితి పెంపు, విద్యకు సంబంధించిన రెమిటెన్స్ లపై టీసీఎస్ మినహాయింపు
అద్దెపై మూలం లేదా టీడీఎస్ వార్షిక పరిమితిని రూ .2.40 లక్షల నుండి రూ .6 లక్షలకు పెంచనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే, నిర్దిష్ట ఆర్థిక సంస్థల నుండి విద్యా రుణం తీసుకున్న సందర్భాల్లో విద్య ప్రయోజనాల కోసం రెమిటెన్స్ కోసం టిసిఎస్ (మూలం వద్ద వసూలు చేసిన పన్ను) మినహాయింపు ఉంటుందని తెలిపారు.
Sat, 01 Feb 202507:00 AM IST
కొత్త ఆదాయ పన్ను స్లాబ్స్ ఇవే..
కొత్త పన్ను విధానంలో ఇకపై ఆదాయ పన్ను స్లాబ్స్ ఇలా ఉండనున్నాయి.
రూ. 12 లక్షల వరకు - ఎలాంటి పన్ను ఉండదు.
రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు - 15%.
రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు - 20%.
రూ. 20 లక్షల నుంచి రూ. 24 లక్షల వరకు - 25%
రూ. 24 లక్షల కన్నా ఎక్కు ఆదాయంపై - 30%.
Sat, 01 Feb 202506:52 AM IST
రూ. 12 లక్షల వరకు పన్ను లేదు, కానీ, ఈ ఆదాయంపై పన్ను చెల్లించాల్సిందే
రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఇచ్చిన నిర్మల సీతారామన్ అందులో ఒక షరతు విధించారు. ఆ ఆదాయంలో క్యాపిటల్ గెయిన్స్ లేదా ఇతర ప్రత్యేక ఆదాయాలు ఉంటే, అవి పన్ను పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు.
Sat, 01 Feb 202506:50 AM IST
రూ. 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేదు, వేతన జీవులకు రూ. 12. 75 లక్షల వరకు నో టాక్స్
మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. ఇక 12 లక్షల రూపాయల వరకు ఆదాయంపై పన్ను ఉండదు. అంటే, వేతన జీవులు, రూ 75 వేల స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని రూ. 12.75 లక్షల వరకు తమ ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించనక్కర లేదు.
Sat, 01 Feb 202506:37 AM IST
టీడీఎస్, టీసీఎస్ లో మార్పులు
టీసీఎస్ పరిమితి రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంపు. అత్యధిక టీడీఎస్ కేవలం పాన్ లేని ట్రాన్సాక్షన్స్ కు మాత్రమే.
Sat, 01 Feb 202506:33 AM IST
మరింత సరళంగా ఐటీ చట్టం
వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఆదాయ పన్ను బిల్లు ఐటీ చట్టాన్ని మరింత సరళంగా మార్చే లక్ష్యంతో తీసుకువస్తున్నామని నిర్మల సీతారామన్ చెప్పారు. సగానికి పైగా అనవసర అంశాలను తొలగిస్తున్నామన్నారు. టీడీఎస్, టీసీఎస్ లను మరింత సరళంగా మారుస్తామన్నారు.
Sat, 01 Feb 202506:26 AM IST
కొత్త ఆదాయపు పన్ను బిల్లు..
వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెడతామని నిర్మల ప్రకటించారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాన్ని సరళతరం చేయడానికి, సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తుందని వివరించారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు పేజీల సంఖ్యను 60శాతం తగ్గించడానికి ప్రయత్నిస్తుందని స్పష్టం చేశారు.
Sat, 01 Feb 202506:24 AM IST
ఉడాన్ పథకం..
ఏవియేషన్ బడ్జెట్ కింద పదేళ్ల వ్యవధిలో 120 కొత్త విమానాశ్రయాలను అనుసంధానం చేయనున్నారు. పట్నా విమానాశ్రయ విస్తరణ ప్రాజెక్టుతో పాటు బీహార్ కు కొత్త గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు లభిస్తాయని నిర్మల తెలిపారు. 'ఉడాన్' పథకం కింద 88 చిన్న నగరాలను విమానాశ్రయాల ద్వారా అనుసంధానం చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
Sat, 01 Feb 202506:33 AM IST
బడ్జెట్ 2025 : స్థూల దేశీయోత్పత్తి..
2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం స్థూల దేశీయోత్పత్తిలో 4.4 శాతం ద్రవ్యలోటును లక్ష్యంగా పెట్టుకుంది.
Sat, 01 Feb 202506:17 AM IST
కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డులు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో సూక్ష్మ సంస్థలకు రూ .5 లక్షల పరిమితితో కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డులను ప్రకటించారు.
Sat, 01 Feb 202506:08 AM IST
బడ్జెట్ 2025 : విద్యా రంగంలో ఏఐ..
కేంద్ర బడ్జెట్ 2025 లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విద్య కోసం కృత్రిమ మేధస్సులో కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటును ప్రకటించారు.
Sat, 01 Feb 202506:08 AM IST
బడ్జెట్2025- పర్యాటక రంగం వృద్ధికి..
వివిధ రాష్ట్రాలతో కలిసి దేశంలోని టాప్-50 పర్యాటక రంగాల అభివృద్ధిని చేపడతామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
Sat, 01 Feb 202506:05 AM IST
బిహార్కి పెద్దపీట..
బడ్జెట్ 2025లో కేంద్రం బిహార్పై ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. వ్యవసాయం నుంచి మౌలికవసతుల వరకు బిహార్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు కేంద్రం బడ్జెట్ ద్వారా తెలిపింది.
Sat, 01 Feb 202506:03 AM IST
మెడికల్ సీట్లు పెంపు..
వచ్చే ఏడాది మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో 10,000 సీట్లు పెంచుతామని, వచ్చే ఐదేళ్లలో 75,000 సీట్లు జోడిస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.
Sat, 01 Feb 202506:01 AM IST
బడ్జెట్ 2025 : కిసాన్ క్రెడిట్ కార్డు.
రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలకు తగినంత మరియు సకాలంలో రుణాలు అందించడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) పథకాన్ని ప్రవేశపెట్టారు.
ఇది రైతులకు 2% వడ్డీ రాయితీ, 3% సకాలంలో తిరిగి చెల్లించే ప్రోత్సాహకంతో వస్తుంది. తద్వారా వారికి సంవత్సరానికి 4% సబ్సిడీ రేటుతో రుణం లభిస్తుంది.
Sat, 01 Feb 202506:00 AM IST
బడ్జెట్ 2025 : ఎస్ఎంఈ, భారీ పరిశ్రమలు..
పాదరక్షలు, తోలు రంగాలను ప్రోత్సహించేందుకు ఫోకస్డ్ స్కీమ్ ను ప్రారంభిస్తాం
ఎస్ఎంఈ, భారీ పరిశ్రమలకు మాన్యుఫ్యాక్చరింగ్ మిషన్ ఏర్పాటు చేస్తాము.
క్రెడిట్ గ్యారంటీ కవరేజీని రెట్టింపు చేసి రూ.20 కోట్లకు, గ్యారంటీ ఫీజును 1 శాతానికి పెంచుతున్నాము.
Sat, 01 Feb 202505:54 AM IST
బడ్జెట్ 2025 : బడ్జెట్ లక్ష్యం ఇదే..
2025-26 కేంద్ర బడ్జెట్లో పన్నులు, పట్టణాభివృద్ధి, మైనింగ్, ఆర్థిక రంగం, విద్యుత్, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ వంటి ఆరు రంగాల్లో సంస్కరణలకు శ్రీకారం చుడతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గత పదేళ్ల ప్రభుత్వ అభివృద్ధి ట్రాక్ రికార్డు, నిర్మాణాత్మక సంస్కరణలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయని చెప్పారు.
వికసిత్ భారత్లో పేదరికం నిర్మూలన, నాణ్యమైన విద్య, అధిక నాణ్యత, సరసమైన, సమగ్ర ఆరోగ్య సంరక్షణ ఉంటుందని, అందరినీ సమ్మిళిత వృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే బడ్జెట్ లక్ష్యమని ఆమె అన్నారు.
Sat, 01 Feb 202505:51 AM IST
బడ్జెట్ 2025 : భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళుతున్నాయి. నిఫ్టీ50 దాదాపు 350 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది.
Sat, 01 Feb 202505:49 AM IST
ధన్ ధన్య కృషి యోజన
ధన్ ధన్య కృషి యోజన 1.7 కోట్ల మంది రైతులకు వర్తిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్రాలతో కలిసి ప్రారంభించే ఈ కార్యక్రమం రైతులకు పుష్కలమైన అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని వివరించారు.
Sat, 01 Feb 202505:46 AM IST
బడ్జెట్ 2025- వ్యవసాయానికి పెద్దపీట..
ఈ దఫా బడ్జెట్లో వ్యవసాయంతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు నిర్మల. అధిక దిగుపడి విత్తనాల వృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించినట్టు వెల్లడించారు. 100 జిల్లాల్లో పీఎం ధనధాన్య కృషి యోజనను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్టు వివరించారు.
Sat, 01 Feb 202505:41 AM IST
బడ్జెట్ 2025 : పేదల బడ్జెట్..
“పేదలు, యువత, రైతులు, మహిళలపై ఫోకస్ చేసి, ఈసారి బడ్జెట్లో 10 రంగాలపై దృష్టి పెట్టాము,” అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
Sat, 01 Feb 202505:38 AM IST
బడ్జెట్ 2025 : విపక్షాలు వాకౌట్..
నిర్మల ప్రసంగం మొదలైన వెంటనే తీవ్ర నిరసనలు చేశారు విపక్ష నేతలు. అనంతరం లోకసభ నుంచి వాకౌట్ చేశారు.
Sat, 01 Feb 202505:34 AM IST
బడ్జెట్ 2025 : నిరసనల మధ్య నిర్మల ప్రసంగం..
లోక్సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు నిరసనలు చేపట్టాయి. తమ మాట వినాలంటూ, తమకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాంటూ నినాదాలు చేశారు. భారీ నినాదాల మధ్యే నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు.
Sat, 01 Feb 202505:34 AM IST
బడ్జెట్ 2025 : పార్లమెంట్ ముందుకు బడ్జెట్..
భారీ ఆశలు, అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ 2025ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలోనే వరుసగా 8వసారి బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు.
Sat, 01 Feb 202505:25 AM IST
బడ్జెట్ 2025 : కేబినెట్ ఆమోదం..
బడ్జెట్ 2025కి కేబినెట్ ఆమోద ముద్రవేసింది. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బడ్జెట్ని ఆమోదించారు.
Sat, 01 Feb 202505:08 AM IST
పార్లమెంట్కు కేంద్ర మంత్రులు..
బడ్జెట్ 2025 నేపథ్యంలో అమిత్ షా సహా కేంద్ర మంత్రులు పార్లమెంట్కి చేరుకున్నారు. ఇంకొద్ది సేపట్లో లోక్సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మొదలవుతుంది.
Sat, 01 Feb 202504:52 AM IST
బడ్జెట్2025 : ముచ్చటగా 8వసారి..
నిర్మలా సీతారామన్ ఇంకొద్ది సేపట్లో తన 8వ బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు. అయితే అత్యధిక బడ్జెట్ ప్రసంగాలు చేసిన లిస్ట్లో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ టాప్లో ఉన్నాయి. ఆయన 10సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. దేశాయ్ 1959-1964 మధ్య ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో మొత్తం 6 బడ్జెట్లు, 1967-1969 మధ్య 4 బడ్జెట్లను ప్రవేశపెట్టారు.
Sat, 01 Feb 202504:44 AM IST
బడ్జెట్ 2025 : ఆటో పరిశ్రమ ఆశలు..
సామాన్యుడి నుంచి వ్యాపారవేత్తల వరకు ఈ దఫా బడ్జెట్ కోసం ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమ ఈసారి భారీ అంచనాలే పెట్టుకుంది. వృద్ధి, ఇన్నోవేషన్, సుస్థిరత, ఎలక్ట్రిక్ వాహన రంగానికి ఊతమిచ్చే విధంగా నిర్మలా సీతారామన్ చర్యలు చేపట్టాలని ఆటోమొబైల్ ఇండస్ట్రీ భావిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Sat, 01 Feb 202504:31 AM IST
బడ్జెట్ 2025 : పార్లమెంట్కు నిర్మలా సీతారామన్..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు.
Sat, 01 Feb 202504:19 AM IST
బడ్జెట్ 2025 : రాష్ట్రపతి భవన్లో నిర్మల
బడ్జెట్ 2025ని ప్రవేశపెట్టే ముందు కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్కి వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు.
Sat, 01 Feb 202504:02 AM IST
బడ్జెట్ 2025 : బడ్జెట్తో నిర్మలా సీతారామన్..
ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు. తాజాగా బడ్జెట్ ట్యాబ్ని ప్రదర్శించారు. ఈసారి కూడా పేపర్లెస్ బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
Delhi: Union Finance Minister Nirmala Sitharaman is all set to present #UnionBudget2025 in the Parliament today.
— ANI (@ANI) February 1, 2025
She will present and read out the Budget through a tab, instead of the traditional 'bahi khata'. pic.twitter.com/Iky9TSOsNW
Sat, 01 Feb 202504:00 AM IST
బడ్జెట్ 2025 : లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
బడ్జెట్ 2025 నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఓపెన్ అయ్యాయి. సెన్సెక్స్ 725 పాయింట్ల లాభంతో 77,484.24 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ50 258 పాయింట్లు పెరిగి 23,508 వద్ద ట్రడ్ అవుతోంది.
Sat, 01 Feb 202504:01 AM IST
బడ్జెట్ 2025 : ఆర్థిక సర్వే..
మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. భారత జీడీపీ 6.3-6.8 శాతం మధ్య ఉంటుందని సర్వే అంచనా వేసింది.
Sat, 01 Feb 202504:01 AM IST
బడ్జెట్ 2025 :: ఏఐపై ఫోకస్..!
ప్రపంచ ఏఐ రంగంలో భారత్ వెనకంజలో ఉన్న నేపథ్యంలో ఈ దఫా బడ్జెట్లో ఆర్టిఫీషియెల్ ఇంటెలిజెన్స్పైనా ప్రభుత్వం ఫోకస్ చేసే అవకాశం ఉంది.
Sat, 01 Feb 202502:44 AM IST
Stocks to buy : బడ్జెట్ వేళ ఈ స్టాక్స్తో లాభాలు..!
మారుతీ సుజుకీ- బై రూ. 12310.65, స్టాప్ లాస్ రూ. 11880, టార్గెట్ రూ. 13172
కరూర్ వైస్య బ్యాంక్- బై రూ. 238.22, స్టాప్ లాస్ రూ. 230, టార్గెట్ రూ. 256
ఎస్బీఐ- బై రూ. 772, స్టాప్ లాస్ రూ. 750, టార్గెట్ రూ. 800
ట్రెంట్- బై రూ. 5753, స్టాప్ లాస్ రూ. 5500, టార్గెట్ రూ. 6100
టాటా కెమికల్స్- బై రూ. 987, స్టాప్ లాస్ రూ. 960, టార్గెట్ రూ. 1020
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
Sat, 01 Feb 202504:01 AM IST
బడ్జెట్ 2025 :: స్టాక్ మార్కెట్లకు నెగిటివ్ ఓపెనింగ్?
బడ్జెట్ 2025 వేళ స్టాక్ మార్కెట్లు నెగిటివ్లో ఓపెన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
Sat, 01 Feb 202502:03 AM IST
Budget news : బడ్జెట్కి ముందే గుడ్ న్యూస్!
బడ్జెట్ 2025కి ముందే దేశ ప్రజలకు గుడ్ న్యూస్ అందింది! ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు భారీగా తగ్గించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 7 తగ్గించినట్టు, ఇది ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించాయి.
Sat, 01 Feb 202501:32 AM IST
Budget 205 : నిర్మలా సీతారామన్ రికార్డు!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు తన 8వ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఇదొక రికార్డు!
Sat, 01 Feb 202501:11 AM IST
Budget 2025 ట్యాక్స్ రిలీఫ్ ఉంటుందా..?
దేశంలో ఆదాయపు పన్ను రేట్లు చాలా అధికంగా ఉన్నాయని గత కొన్నేళ్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయంపై సోషల్ మీడియా వేదికగా నిర్మలా సీతారామన్పై మీమ్స్ కూడా నిత్యం కనిపిస్తుంటాయి. మరి ఈ విషయంపై ఈ దఫా బడ్జెట్లోనైనా ప్రజలకు రిలీఫ్ దక్కుతుందో లేదో చూడాలి.
Sat, 01 Feb 202512:52 AM IST
Budget 2025 income tax : పేదలు, మధ్యతరగతి ప్రజల 'బడ్జెట్'!
బడ్జెట్ 2025 కోసం యావత్ భారత దేశం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ అందే విధంగా ఈ దఫా బడ్జెట్ని కేంద్రం రూపొందించినట్టు మోదీ సంకేతాలిచ్చారు. ఫలితంగా ఆదాయపు పన్ను ట్యాక్స్ తగ్గుతుందన్న ఊహాగానాలు మరింత పెరిగాయి. పూర్తి వివరాల తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Sat, 01 Feb 202512:50 AM IST
Budget 2025 : బడ్జెట్ ప్రిపరేషన్..
ఆర్థిక మంత్రిత్వ శాఖ 2024 అక్టోబర్లో బడ్జెట్ తయారీని ప్రారంభించింది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక అంచనాలు, అవసరాలను ఖరారు చేయడానికి వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చలు జరిపింది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రజల ముందుకు వస్తోంది.
Sat, 01 Feb 202512:50 AM IST
Budget 2025 Stock market : స్టాక్ మార్కెట్ ఓపెన్..
శనివారమే అయినా, బడ్జెట్ 2025 నేపథ్యంలో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు ఓపెన్లో ఉండనున్నాయి. మరి బడ్జెట్ డే ట్రేడింగ్ ఎలా చేయాలి? ఎలా సక్సెస్ అవ్వాలి? జెరోధా సీఈఓ నితిన్ కామత్ చెప్పిన కొన్ని టిప్స్ని తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Sat, 01 Feb 202512:48 AM IST
Budget 2025 live : ఎక్కడ చూడాలి?
కేంద్ర బడ్జెట్ని పార్లమెంటు అధికారిక ఛానళ్లు, దూరదర్శన్, సంసద్ టీవీల్లో ప్రసారం చేయనున్నారు. ఇది ప్రభుత్వ అధికారిక యూట్యూబ్ ఛానెళ్లలో కూడా ప్రసారం కానుంది. నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025 ప్రసంగాన్ని https://telugu.hindustantimes.com/ లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. బడ్జెట్ 2025 గురించి అన్ని తాజా అప్డేట్లను హెచ్టీ తెలుగు బడ్జెట్ లైవ్ బ్లాగ్లో ట్రాక్ చేయవచ్చు.
Sat, 01 Feb 202512:48 AM IST
Budget 2025 : నిర్మలకు 8వ బడ్జెట్..
ఆ రోజు ఉదయం 11 గంటలకు లోక్సభలో ఆమె ప్రసంగం ప్రారంభమవుతుంది. నిర్మలా సీతారామన్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం ఇది వరుసగా 8వసారి. గత నాలుగు కేంద్ర బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ మాదిరిగానే 2025-26 పూర్తి కేంద్ర బడ్జెట్ సైతం కాగిత రహిత రూపంలోనే ఉండనుంది.
Sat, 01 Feb 202512:46 AM IST
Budget 2025 : నేడే బడ్జెట్ 2025..
దేశంలో మరో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 'బడ్జెట్ 2025'ని నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ దఫా బడ్జెట్ కోసం సామాన్యుడి నుంచి బడా వ్యాపారవేత్తల వరకు అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.