తక్కువ ధరతో లాంగ్ వాలిడిటీ కోరుకునే వారికి బీఎస్ఎన్ఎల్ ఈ రీఛార్జ్ ప్లాన్స్ బెస్ట్!-bsnl launches affordable recharge plans with up to 160 day validity check here for details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  తక్కువ ధరతో లాంగ్ వాలిడిటీ కోరుకునే వారికి బీఎస్ఎన్ఎల్ ఈ రీఛార్జ్ ప్లాన్స్ బెస్ట్!

తక్కువ ధరతో లాంగ్ వాలిడిటీ కోరుకునే వారికి బీఎస్ఎన్ఎల్ ఈ రీఛార్జ్ ప్లాన్స్ బెస్ట్!

Anand Sai HT Telugu

బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు లాంగ్ వాలిడిటీతో మరో రెండు ప్లాన్లను తీసుకువచ్చింది. ఇవి 160 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఈ రెండు ప్లాన్ల గురించి వివరంగా తెలుసుకుందాం..

బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్స్

్రైవేట్ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్టెల్, విఐ ఇప్పటికే తమ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచాయి. అయితే బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ తన ప్లాన్లను పాత, సరసమైన ధరలకు అందిస్తోంది. 160 రోజుల వ్యాలిడిటీతో లాంగ్ వాలిడిటీతో మరో రెండు ప్లాన్లను తీసుకొచ్చింది. మీరు కూడా లాంగ్ వాలిడిటీతో సరసమైన ప్లాన్ కోసం చూస్తే.. ఈ ప్లాన్స్ మీకు సరైన ఆప్షన్ కావచ్చు. బీఎస్ఎన్ఎల్ అందించే రూ.947, రూ.569 ప్లాన్ల గురించి తెలుసుకుందాం..

రూ .947 ప్లాన్

బీఎస్ఎన్ఎల్ రూ .947 ప్లాన్ గురించి ప్రత్యేక విషయం ఏమిటంటే, ఈ ప్లాన్ ఇప్పుడు తగ్గింపు ధరలో లభిస్తుంది. ఇంతకుముందు దీని ధర రూ .997 కాగా.. బీఎస్ఎన్ఎల్ దాని ధరను రూ .50 తగ్గించింది. ఈ ప్లాన్ వాలిడిటీ 160 రోజులు. ఈ ప్లాన్లో వినియోగదారులకు రోజుకు 2 జీబీ డేటాతో పాటు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్ లభిస్తుంది.

వాలిడిటీ పీరియడ్‌లో కస్టమర్లకు మొత్తం 320 జీబీ డేటా లభిస్తుంది. దీంతోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. సరసమైన ధరలో లాంగ్ వాలిడిటీ, మంచి డేటా కావాలనుకునే వారికి ఈ ప్లాన్ సరైనది.

రూ .569 ప్లాన్

బీఎస్ఎన్ఎల్ రూ.569 ప్లాన్ ప్రవేశపెట్టింది. గతంలో రూ.599కు లభించే దీని ధరను ఇప్పుడు రూ.30 తగ్గించారు. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్లో వినియోగదారులు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్‌తో రోజుకు 3 జీబీ డేటాను పొందుతారు. మొత్తం వ్యాలిడిటీ పీరియడ్లో కస్టమర్లకు మొత్తం 252 జీబీ డేటా లభిస్తుంది.

రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. ఓటీటీ యాప్స్‌లో కంటెంట్ చూడటానికి ఎక్కువ సమయం వెచ్చించేవారికి, ప్రతిరోజూ ఎక్కువ డేటా అవసరమైన వారికి ఈ ప్లాన్ సరైనది.

ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచుతున్నప్పటికీ బిఎస్‌ఎన్‌ఎల్ పెంచడం లేదు. ఇది డబ్బు ఆదా చేయాలనుకునే వినియోగదారులకు మంచి ఆప్షన్‌గా మారింది. ఈ ప్లాన్‌లు ప్రైవేట్ టెలికాంలపై ఒత్తిడిని సృష్టిస్తాయని, గ్రామీణ, బడ్జెట్ ఫ్రెండ్లీ కోసం చూసేవారికి ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నారు. మీరు కూడా తక్కువ ధరతో రీఛార్జ్ ఆప్షన్‌ కోసం చూస్తున్నట్లయితే బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్‌లను పరిగణనలోకి తీసుకోవచ్చు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.