మీరు జీమెయిల్ ఉపయోగిస్తుంటే గూగుల్ చేస్తున్న కొత్త మార్పులను మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. వినియోగదారు గుర్తింపు ధృవీకరించడానికి.. గూగుల్ జీమెయిల్ కోసం ఎస్ఎంఎస్ ఆధారిత 6-అంకెల అథెంటికేషన్ కోడ్లను తొలగిస్తోంది. దీనికి బదులుగా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్(2ఎఫ్ఏ) కోసం గూగుల్ క్యూఆర్ కోడ్లను ఎంచుకుంటోంది. జీమెయిల్ ఖాతాను మరింత భద్రపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
జీమెయిల్ ప్రతినిధి రాస్ రిచెండ్ఫెర్ ప్రకారం, రాబోయే నెలల్లో ఈ మార్పు అమలు అవుతుందని భావిస్తున్నారు. ఇది ఎస్ఎంఎస్ ధృవీకరణతో పెరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. వినియోగదారు గుర్తింపు ధృవీకరించడానికి జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలంటే మీ నెంబర్ ఎంటర్ చేసి 6 అంకెల కోడ్ను రిసీవ్ చేసుకోవడానికి బదులుగా మీ ఫోన్ కెమెరా యాప్తో స్కాన్ చేయాల్సిన క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది.
ఎస్ఎంఎస్ ఆధారిత వెరిఫికేషన్ ద్వారా ఫిషింగ్ మోసాలు పెరుగుతున్నందున ఈ మార్పుకు గూగుల్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టిన తర్వాత, వినియోగదారులు టెక్స్ట్ సందేశానికి బదులుగా వారి స్మార్ట్ఫోన్ కెమెరాను ఉపయోగించి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తారు. ఈ కొత్త అప్డేట్ ఎప్పటి నుంచి అమలు అవుతుందో కచ్చితమైన విడుదల తేదీని ప్రకటించనప్పటికీ.. త్వరలోనే దీనిపై మరింత సమాచారం లభిస్తుందని రాస్ రిచెండ్ఫెర్ తెలిపారు.
టూ-స్టెప్ ఆథెంటికేషన్ అనేది జీమెయిల్లో ఒక భద్రతా ప్రక్రియ. ఇది మీ ఖాతాకు అదనపు గోప్యతను ఇస్తుంది. మీరు జీమెయిల్ ఖాతాను సృష్టించినప్పుడు, మీరు మొబైల్ నంబర్ను నమోదు చేయాలి. మీ ఖాతాకు లాగిన్ చేసేటప్పుడు మీరు నమోదు చేయాల్సిన కోడ్తో టెక్స్ట్ సందేశాన్ని అందుకుంటారు. మీరు ఈ కోడ్ ఎంటర్ చేసే వరకు, మీ ఖాతా లాగిన్ అవ్వదు. ఈ ప్రక్రియ త్వరలో మారబోతోంది. వినియోగదారు గుర్తింపు ధృవీకరించడానిక ఇక భవిష్యత్తులో క్యూఆర్-కోడ్ను స్కాన్ చేయాలి.
సంబంధిత కథనం