ఈ రోజు బ్యాంకులకు సెలవు ఉందా? అని తెలుసుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. నేడు నాలుగో శనివారం. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్యాలెండర్ ప్రకారం 2025 ఏప్రిల్ 26న బ్యాంకులకు సెలవు ఉంది. బ్యాంకులు తిరిగి సోమవారం ఓపెన్ అవుతాయి. ఆదివారం కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
బ్యాంకులు సాధారణంగా ప్రతి నెల రెండు, నాల్గొవ శనివారాలు మూతపడి ఉంటాయి. కాగా మొదటి, మూడొవ శనివారాలలో తెరిచి ఉంటాయి. ఏప్రిల్ 26న నాలుగో శనివారం కావడంతో ఈ రోజు బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఒక నిర్దిష్ట రోజున బ్యాంకులు తెరిచి ఉన్నాయా లేదా మూతపడి ఉన్నాయా? అని తనిఖీ చేయడానికి, ఖాతాదారులు ఆర్బీఐ అధికారిక ఛానళ్లను క్షుణ్ణంగా సందర్శించాలి. వెబ్సైట్, బ్యాంకు నోటిఫికేషన్లు చూడాలి.
బ్యాంకు సెలవులను నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్ (ఆర్టీజీఎస్) సెలవులు, బ్యాంకుల ఖాతాల మూసివేత అనే మూడు రకాలుగా వర్గీకరించింది ఆర్బీఐ.
చెక్కులు, ప్రామిసరీ నోట్ల జారీని నియంత్రించే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం 2025 ఏప్రిల్ 26 శనివారం సెలవు దినంగా నిర్ణయించారు. అందువల్ల సెలవు రోజుల్లో ఈ సాధనాలతో సహా లావాదేవీలు అందుబాటులో ఉండవు.
బ్యాంకు సెలవు దినాల్లో కూడా ఖాతాదారులు దేశవ్యాప్తంగా ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. వినియోగదారులు సౌకర్యవంతమైన ఆర్థిక లావాదేవీల కోసం ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు.
నెఫ్ట్/ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్ ఫారాలు, డిమాండ్ డ్రాఫ్ట్ రిక్వెస్ట్ ఫారాలు, చెక్బుక్ ఫారాలను ఉపయోగించి ఫండ్ ట్రాన్స్ఫర్ అభ్యర్థనలు చేయవచ్చు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఏటీఎం కార్డులను కార్డు సేవల ద్వారా పొందవచ్చు. అకౌంట్ మెయింటెనెన్స్ ఫారాలు, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏర్పాటు చేయడం, లాకర్ కోసం దరఖాస్తు చేయడం వంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఏప్రిల్ నెలలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారాంతాలు మినహా తొమ్మిది రోజులు బ్యాంకులకు సెలవు లభించింది.
మే నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల లిస్ట్ని తెలుసుకనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం