ఈ మధ్య కాలంలో హాస్పిటల్ బిల్లులు భారీగా పెరిగిపోతున్నాయి. చికిత్సకు ముందే ప్రజలు గుండెలు పట్టుకుంటున్నారు. అయితే.. రూ. 5లక్షల వరకు ఉచిత వైద్యం, హాస్పిటల్ ఖర్చులు ఇచ్చే ఒక కేంద్ర పథకం ఉంది. అదే.. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన్. ఈ పథకం ద్వారా ఇచ్చే ఆయుష్మాన్ భారత్ కార్డుతో.. ఏటా రూ. 5లక్షల వరకు వైద్య చికిత్సలను ఉచితంగా చేసుకోవచ్చు. అయితే ఈ కార్డు పొందేందుకు కొన్ని అర్హతలు, నియమాలు ఉన్నాయి. వాటిని ఇక్కడ తెలుసుకుందాము..
లాంచ్ డేట్:- 2018 సెప్టెంబర్ 23
కవరేజ్:- ఏడాదికి రూ. 5 లక్షలు
ప్రీ-హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్స్ కవరేజ్:- 3 రోజుల వరకు
పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్స్ కవరేజ్:- 15 రోజుల వరకు
వెబ్సైట్:- https://pmjay.gov.in/
ఫోన్ నెంబర్:- 1800-111-565 లేదా 14555
స్టెప్ 1:- ఆయుష్మాన్ భారత్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి.
స్టెప్ 2:- హోం పేజ్లో కనిపించే 'Am I eligible' సెక్షన్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3:- మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ ఇవ్వండి. జెనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 4:- ఓటీపీని ఎంటర్ చేసి, వెరిఫై ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 5:- మీ పేరు, వయస్సు, కుటుంబసభ్యులు, రాష్ట్రం, ఆదాయం వంటి వివరాలను ఫిల్ చేయండి.
స్టెప్ 1:- సబ్మీట్ బటన్ మీద క్లిక్ చేయండి.
ఈ కింద వాటిల్లో ఒకటి ఉన్నా.. ఆయుష్మాన్ భారత్ కార్డు లభించదు. అవి..
2,3, 4 వీలర్- ఫిషింగ్ బోట్
రూ. 50వేలు క్రెడిట్ లిమిట్ ఉండే కిసాన్ కార్డు
ప్రభుత్వ ఉద్యోగులు
ప్రభుత్వ ఆధారిత వ్యవసాయేతర సంస్థలు
నెలకు రూ. 10వేలు, అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్న వారు
పక్కా ఇళ్లల్లో నివాసముంటున్నవారు.
5 ఎకరాలు అంతకన్నా ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారు.
అందుకే.. ఈ ఆయుష్మాన్ భారత ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన్ అందరికి ఉపయోగపడదు. బడుగుబలహీన వర్గాలు ఈ పథకం ద్వారా లబ్ధిపొందొచ్చు. ఇలాంటి వారికి ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరికైతే అవసరం ఉందో, వారికి ఈ సమాచారం షేర్ చేయండి.
ఇంకో విషయం! ఇప్పుడు హెచ్టీ తెలుగు వాట్సాప్ ఛానెల్లో అందుబాటులో ఉంది. పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం హెచ్టీ తెలుగు వాట్సాప్ ఛానెల్ని ఫాలో అవ్వండి.
సంబంధిత కథనం