రేపటి నుంచి ఏథర్​ ఎనర్జీ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​- జీఎంపీ ఎంత? మీరు అప్లై చేయలా?-ather energy ipo opens tomorrow gmp price other details you may like to know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  రేపటి నుంచి ఏథర్​ ఎనర్జీ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​- జీఎంపీ ఎంత? మీరు అప్లై చేయలా?

రేపటి నుంచి ఏథర్​ ఎనర్జీ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​- జీఎంపీ ఎంత? మీరు అప్లై చేయలా?

Sharath Chitturi HT Telugu

ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఏథర్​ ఎనర్జీకి చెందిన ఐపీఓ సోమవారం సబ్​స్క్రిప్షన్​కి ఓపెన్​ అవ్వనుంది. ఈ ఐపీఓ జీఎంపీ ఎంత? మీరు ఈ ఐపీఓకి సబ్​స్క్రైబ్​ చేసుకోవాలా? నిపుణులు ఏమంటున్నారంటే..

ఏథర్​ ఎనర్జీ ఐపీఓ వివరాలు..

ఏథర్​ ఎనర్జీ ఐపీఓపై బిగ్​ అప్డేట్​! ఎలక్ట్రిక్​ వాహన తయారీదారుకు చెందిన ఈ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ సోమవారం ఓపెన్​ అవ్వనుంది. ఈ నేపథ్యంలో ఇనీషియల్​ పబ్లిక్​ ఆఫరింగ్​ వివరాలు, జీఎంపీ, ఈ ఐపీఓకి సబ్​స్క్రైబ్​ చేసుకోవచ్చా? లేదా? అన్న నిపుణుల అభిప్రాయాలను ఇక్కడ తెలుసుకోండి..

ఏథర్​ ఎనర్జీ ఐపీఓ వివరాలు..

రెండు నెలల తర్వాత ప్రైమరీ మార్కెట్​ మెయిన్ బోర్డ్ సెగ్మెంట్​లో వస్తున్న ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ఈ ఏథర్​ ఎనర్జీ. ఈ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ ఏప్రిల్ 28, సోమవారం ఓపెన్​ అయ్యి ఏప్రిల్ 30 బుధవారం నాడు ముగుస్తుంది.

ఏథర్ ఎనర్జీ అనేది ప్రత్యేక ఎలక్ట్రిక్ వాహన తయారీదారు. ఇది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను (ఈ2డబ్ల్యు) నిర్మిస్తుంది. సొంతంగా సాఫ్ట్​వేర్​, ఛార్జింగ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ యాక్ససరీలు ఈ సంస్థకు ఉన్నాయి ఇవన్నీ భారతదేశంలో తయారై, అభివృద్ధి అవుతాయి.

ఏథర్ ఎనర్జీ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ.304 నుంచి రూ.321గా నిర్ణయించారు. రాబోయే ఐపీఓలో ఫ్రెష్​ ఈక్విటీ షేర్ల విలువ రూ .2,626 కోట్లు. ప్రమోటర్లు, ఇతర ప్రస్తుత వాటాదారులు 1.1 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కూడా ఈ ఐపీఓలో భాగం.

మొత్తం ఐపీఓ ద్వారా వచ్చిన రూ.927.2 కోట్లను మహారాష్ట్రలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి, రూ.40 కోట్లను రుణ చెల్లింపులకు, రూ.750 కోట్లను పరిశోధన- అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడానికి, రూ.300 కోట్లను మార్కెటింగ్ ప్రయత్నాలకు కేటాయించడానికి ఉపయోగించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ నిధులను 2026 నుంచి 2028 ఆర్థిక సంవత్సరాల్లో వినియోగించాలని భావిస్తోంది.

ఈ ఐపీఓలో కనీసం 75 శాతం వాటాలను క్వాలిఫైడ్ ఇన్​స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ)కు, 15 శాతం నాన్ ఇన్​స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు(ఎన్​ఐఐ)కు, 10 శాతం వరకు రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించింది కంపెనీ. అదనంగా, ఉద్యోగుల కోసం 1,00,000 ఈక్విటీ షేర్లను కేటాయించారు. వారు ప్రతి షేరుకు రూ .30 తగ్గింపు పొందుతారు.

ఏథర్ ఎనర్జీ ఐపీఓ కోసం ప్రాథమిక వాటా కేటాయింపు మే 2, శుక్రవారం జరగనుంది. రిఫండ్స్​ని మే 5, సోమవారం కంపెనీ ప్రాసెస్ చేస్తుంది. రీఫండ్ చేసిన రోజే కేటాయింపుదారుల డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్లు జమ అవుతాయి. ఏథర్ ఎనర్జీ షేర్లు మే 6 మంగళవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ కానున్నాయి.

యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్, హెచ్ఎస్​బీసీ సెక్యూరిటీస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, నోమురా ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ఏథర్ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. లింక్ ఇన్ టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఇష్యూకు రిజిస్ట్రార్​గా వ్యవహరిస్తోంది.

ఏథర్ ఎనర్జీ ఐపీఓ జీఎంపీ..

అన్​లిస్టెడ్ గ్రే మార్కెట్​లో ఏథర్ ఎనర్జీ ఐపీఓ షేర్లు రూ.3 ప్రీమియం వద్ద ట్రేడవుతున్నాయి.

ఐపీఓ ప్రైస్ బ్యాండ్ అప్పర్​ ఎండ్​, ప్రస్తుత గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) ఆధారంగా ఏథర్ ఎనర్జీ అంచనా లిస్టింగ్ ధర ప్రతి షేరుకు రూ .324. ఇది ఐపీఓ ధర రూ .321 కంటే 0.93% పెరుగుదలను ప్రతిబింబిస్తుంది.

మీరు సబ్​స్క్రైబ్ చేసుకోవాలా?

లాంగ్​ టర్మ్​ ప్లాన్స్​తో ఈ ఏథర్​ ఐపీఓకి సబ్​స్క్రైబ్​ చేసుకోవచ్చని బ్రోకరేజీ సంస్థ బజాజ్ బ్రోకింగ్ సూచిస్తోంది. దానికన్నా ముందు కంపెనీకి సంబంధించిన పూర్తి సమచారం తెలుసుకోవాలని చెబుతోంది.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఐపీఓలో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం