అంధులు లేదా దృష్టి లోపం ఉన్న వినియోగదారులు భారతదేశంలోని అతిపెద్ద డెలివరీ యాప్ లను ఉపయోగించి కిరాణా వస్తువులు లేదా భోజనాన్ని స్వతంత్రంగా ఆర్డర్ చేయగలిగేలా లేవని ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. స్విగ్గీ, జెప్టో సంస్థలు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లను అంధులు లేదా దృష్టి లోపం ఉన్న వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడంలో విఫలమయ్యాయని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టు లో ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు తమ స్పందన తెలియజేయాలని స్విగ్గీ, జెప్టో, కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మే 28కి వాయిదా వేసింది.
స్విగ్గీ, జెప్టో తదితర ఫుడ్ లేదా గ్రోసరీ డెలివరీ యాప్ లు అంధులు లేదా దృష్టి లోపం ఉన్న వినియోగదారులు ఉపయోగించుకునే సౌలభ్యం కల్పించకపోవడం వికలాంగుల హక్కుల చట్టం-2016ను ఉల్లంఘించడమేనని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇది సమానత్వం, గౌరవం, భావ ప్రకటనా స్వేచ్ఛను నిరాకరించడంతో సహా విస్తృత రాజ్యాంగ ఉల్లంఘనలను కూడా ఇది ఉదహరిస్తుంది.
డిజిటల్ యాక్సెసబిలిటీ ప్రమాణాలను పూర్తిగా పాటించేలా ప్రతివాదులను ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. రిక్వెస్ట్ చేసిన ఫీచర్లలో స్క్రీన్ రీడర్ కంపాటబిలిటీ, యాక్సెస్ చేయలేని అంశాలకు ప్రత్యామ్నాయాలు మరియు రిటర్న్స్ ప్రాసెసింగ్ వంటి పనుల కోసం వాయిస్-గైడెడ్ కెమెరా సహాయం వంటివి ఉన్నాయి. ఈ సమస్యలను మొదట కంపెనీల కస్టమర్ సపోర్ట్ బృందాలతో ప్రస్తావించామని, కానీ అర్థవంతమైన ప్రతిస్పందన లభించలేదని ఆ ఎన్జీవో పేర్కొంది. స్విగ్గీ, జెప్టోల వివరణ కోరుతూ ఈమెయిల్ చేయగా, వాటి నుంచి సమాధానం రాలేదు.