అక్షయ తృతీయ వేళ తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరల వివరాలు ఇలా..-akshaya tritiya 2025 gold price today in hyderabad vijayawada and other cities ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  అక్షయ తృతీయ వేళ తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరల వివరాలు ఇలా..

అక్షయ తృతీయ వేళ తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరల వివరాలు ఇలా..

Sharath Chitturi HT Telugu

అక్షయ తృతీయ వేళ దేశంలో పసిడి ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్​, విజయవాడతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో నేటి బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (PTI)

అక్షయ తృతీయ వేళ దేశంలో బంగారం ధరలు పెరిగాయి. 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 460 పెరిగి.. రూ. 98,153కి చేరింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 4600 పెరిగి, రూ. 9,81,530కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 9,815గా కొనసాగుతోంది.

మరోవైపు 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 420 వృద్ధి చెంది.. రూ. 89,983కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(22క్యారెట్లు) పసిడి ధర రూ. 4200 పెరిగి.. రూ. 8,99,830గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు పెరిగాయి. దేశ కోల్​కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,835గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,005గా ఉంది. దిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,983 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 98,153గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,831గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,001గా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 89,837గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 98,007గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,839గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,009గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,845గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,015గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,847గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,017గా నమోదైంది.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,891గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 98,061గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 89,830గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 98,000గా ఉంది.

అక్షయ తృతీయ డిమాండ్​, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ టారీఫ్​ హెచ్చరికలు, ఆర్​బీఐ వడ్డీ రేట్ల కోత, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 10,300గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 1,03,500కి చేరింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,14,200 పలుకుతోంది. వెండి ధరలు విజయవాడలో రూ.​1,15,000.. విశాఖపట్నంలో రూ. 1,12,000గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం