Urinating on co-passenger: ఢిల్లీ-బ్యాంకాక్ ఎయిరిండియా విమానంలో సహ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన-air india flyer urinates on co passenger in delhi bangkok flight airline reacts ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Urinating On Co-passenger: ఢిల్లీ-బ్యాంకాక్ ఎయిరిండియా విమానంలో సహ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన

Urinating on co-passenger: ఢిల్లీ-బ్యాంకాక్ ఎయిరిండియా విమానంలో సహ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన

Sudarshan V HT Telugu

Urinating on co-passenger: ఎయిరిండియా విమానంలో సహ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనను ధృవీకరిస్తూ ఎయిరిండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనకు సంబంధించి డీజీసీఏ నిర్దేశించిన అన్ని విధానాలను తమ సిబ్బంది పాటించారని తెలిపింది.

విమానంలో సహ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన (Representational photo)

Urinating on co-passenger: ఢిల్లీ-బ్యాంకాక్ ఎయిరిండియా విమానంలో ఓ భారతీయ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనను ధృవీకరిస్తూ విమానయాన సంస్థ ఎయిరిండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన జరిగిన తర్వాత సిబ్బంది డీజీసీఏ నిర్దేశించిన అన్ని విధివిధానాలను పాటించారని తెలిపింది.

సహ ప్రయాణికుడిపై మూత్రం

2025 ఏప్రిల్ 9న ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఏఐ2336 విమానంలో ఒక ప్యాసెంజర్ తన సహ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనను ఎయిరిండియా ధృవీకరించింది. సిబ్బంది అన్ని విధివిధానాలను పాటించారని, ఈ విషయాన్ని అధికారులకు నివేదించామని తెలిపింది. నిందితుడైన ప్రయాణికుడిని సిబ్బంది హెచ్చరించారని, ఈ సంఘటనకు గురైన బాధితుడు ప్రముఖ బహుళజాతి కంపెనీ ఉద్యోగి అని వెల్లడించింది. బాధితుడు తన ఫిర్యాదును బ్యాంకాక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో తమ సిబ్బంది సహాయపడ్డారని ఎయిరిండియా తెలిపింది.

బ్యాంకాక్ లో ఫిర్యాదు

‘‘దురుసుగా ప్రవర్తించిన ప్రయాణికుడిని హెచ్చరించడంతో పాటు, బాధిత ప్రయాణికుడికి బ్యాంకాక్ లోని అధికారులకు ఫిర్యాదు చేయడానికి మా సిబ్బంది సహాయం చేయడానికి ముందుకొచ్చారు. దురుసుగా ప్రవర్తించిన ప్రయాణికుడిపై తీసుకోవలసిన చర్యలను నిర్ణయించడానికి స్టాండింగ్ ఇండిపెండెంట్ కమిటీని సమావేశపరుస్తారు. ఇలాంటి విషయాల్లో డీజీసీఏ నిర్దేశించిన ఎస్ఓపీలను ఎయిర్ ఇండియా అనుసరిస్తోంది’’ అని ఎయిరిండియా తెలిపింది.

శంకర్ మిశ్రా మూత్ర విసర్జన కేసు

తాజాగా ఎయిరిండియా విమానంలో జరిగిన మూత్ర విసర్జన కేసు 2022లో జరిగిన మరో సంఘటన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ముంబైకి చెందిన శంకర్ మిశ్రా అనే వ్యక్తి 2022 నవంబర్ 26న న్యూయార్క్-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఘటన అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు. మిశ్రాను ఆయన పనిచేసిన వెల్స్ ఫార్గో సంస్థ తొలగించింది. మిశ్రా కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా ఉన్న బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ అయిన భారతదేశంలోని వెల్స్ ఫార్గోకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2023 జనవరిలో మిశ్రాపై ఢిల్లీ పోలీసులు లైంగిక వేధింపులు, అశ్లీలత అభియోగాలు మోపారు. ఈ చర్యకు సంబంధించి కేసు నమోదు చేసిన విమానయాన సంస్థ ఆయనను 30 రోజుల పాటు విమానంలో ప్రయాణించకుండా నిషేధించింది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం