RBI rate cuts: మధ్యతరగతి ప్రజలకు మరో గుడ్​ న్యూస్​? ఆర్​బీఐ రేట్​ కట్స్​ షురూ..!-after tax relief will rbi also cheer the middle class with a rate cut ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Rbi Rate Cuts: మధ్యతరగతి ప్రజలకు మరో గుడ్​ న్యూస్​? ఆర్​బీఐ రేట్​ కట్స్​ షురూ..!

RBI rate cuts: మధ్యతరగతి ప్రజలకు మరో గుడ్​ న్యూస్​? ఆర్​బీఐ రేట్​ కట్స్​ షురూ..!

Sharath Chitturi HT Telugu
Feb 02, 2025 01:08 PM IST

RBI MPC meeting : బడ్జెట్​ 2025 రూపంలో మధ్యతరగతి ప్రజలకు బిగ్​ రిలీఫ్​ దక్కింది! మరి ఇప్పుడు ఆర్​బీఐ కూడా వడ్డీ రేట్ల కోతను మొదలుపెట్టి, మధ్యతరగతి ప్రజలకు గుడ్​ న్యూస్​ ఇస్తుందా? అంటే అవుననే అంచనాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు..

ఆర్​బీఐ రేట్​ కట్స్​ వచ్చేస్తున్నాయి..!
ఆర్​బీఐ రేట్​ కట్స్​ వచ్చేస్తున్నాయి..! (Agencies)

‘బడ్జెట్​ 2025’లో రూ. 12లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపును ఇస్తూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ చేసిన ప్రకటనతో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభించింది! ఇక ఇప్పుడు.. అందరి దృష్టి రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ)పై పడింది. మధ్యతరగతి ప్రజలకు ఉపశమనాన్ని కలిగించే విధంగా వడ్డీ రేట్లను ఆర్బీఐ కట్​ చేస్తుందని సర్వత్రా అంచనాలు మొదలయ్యాయి.

yearly horoscope entry point

బడ్జెట్​ అయిపోయింది- నెక్ట్స్​ ఆర్​బీఐ రెట్​ కట్​?

2025 తొలి ఆర్​బీఐ మొనేటరీ పాలసీ మీటింగ్​ ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు జరగనుంది. 7న జరిగే మీడియా సమావేశంలో వడ్డీ రేట్లు/ రెపో రేట్లపై కీలక వివరాలను గవర్నర్​ సంజయ్​ మల్హోత్రా ప్రకటిస్తారు. 

అయితే, ఈసారి రెట్​ కట్స్​ కచ్చితంగా ఉంటాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి! ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం మారుతున్న ధోరణులను దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ బ్యాంక్ ఫిబ్రవరి 7న 25 బేసిస్ పాయింట్ల రేట్ల కోతను ప్రకటిస్తుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

చాలా కాలం పాటు ఆర్​బీఐకి ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణం తలనొప్పిని తెచ్చిపెట్టింది. అందుకే వడ్డీ రేట్ల కోత నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇటీవలి కాలంలో ఇవి తగ్గుముఖం పట్టినట్టు డేటా చెబుతోంది. అదే సమయంలో అధిక వడ్డీ రేట్ల కారణంగా దేశ ఆర్థిక వృద్ధి ఆశించనంత మేర ఉండటం లేదు.

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం క్రమంగా 4 శాతానికి తగ్గుతుందని 2025 ఆర్థిక సర్వే పేర్కొంది. ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉండాలని కూడా ఇది ఆశిస్తోంది. అయితే వృద్ధి దాని వేగాన్ని కొనసాగించడంలో ప్రభుత్వ సంస్థల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

వృద్ధి, ద్రవ్యోల్బణ డేటా రెండూ ద్రవ్య పరిస్థితులను సులభతరం చేయాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయని భారతదేశం, ఆసియాన్ ఆర్థికవేత్త (బోఫ్​ఆఎస్ ఇండియా) రాహుల్ బజోరియా అభిప్రాయపడ్డారు.

ఫిబ్రవరి ఎంపీసీలో ఆర్​బీఐ రెపో రేటును 25 బీపీ నుంచి 6.25 శాతానికి తగ్గించాలని, ఏకగ్రీవ నిర్ణయంతో, 50 బీపీ సిఆర్ఆర్​ని మరోసారి తగ్గించడం లేదా బహిరంగ మార్కెట్ కార్యకలాపాల ద్వారా గణనీయమైన బాండ్ల కొనుగోళ్లను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా మన్నికైన లిక్విడిటీని చొప్పించడానికి చర్యలు తీసుకుంటుందని బజోరియా భావిస్తున్నారు.

"వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాల దృష్ట్యా సరఫరా షాక్​లు తగ్గుముఖం పట్టడంతో ఆర్​బీఐ వృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందని భావిస్తున్నాం. 2025 నాటికి సీపీఐ 4 శాతానికి దగ్గరగా ఉన్నందున ఆర్​బీఐ ఈ సైకిల్​లో 100 బీపీ రేట్లను తగ్గించవచ్చని మేము భావిస్తున్నాము. ఇది 2025 చివరి నాటికి రెపో రేటును 5.50 శాతానికి తీసుకువస్తుంది," అని బజోరియా అన్నారు.

ఫిబ్రవరి ఎంపీసీలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని ఎలారా సెక్యూరిటీస్ ఆర్థికవేత్త గరిమా కపూర్ సైతం అంచనా వేశారు.

"ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపు, ప్రస్తుత రేట్​ కట్​ సైకిల్​లో 75 బేసిస్ పాయింట్ల తగ్గింపుపై మా అభిప్రాయాన్ని కొనసాగిస్తున్నాం. అయినప్పటికీ, బయట పరిస్థితులు మా ఔట్​లుక్​ని ప్రభావితం చేసే అవకాశం ఉంది," అని కపూర్ చెప్పారు.

అధిక ధరల కారణంగా చాలా ఏళ్ల పాటు వడ్డీ రేట్లను పెంచిన ఆర్​బీఐ.. ఇటీవలి కాలంలో వాటిని యథాతథంగా ఉంచుతూ వస్తోంది. ఇప్పుడు బడ్జెట్​లో రూ. 12లక్షల వరకు ట్యాక్స్​ మినహాయింపు లభించింది. ఆర్​బీఐ కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తే, ప్రజలకు మరింత “బయ్యింగ్​” పవర్​ లభించినట్టు అవుతుంది. తద్వారా ప్రజలు స్పెండింగ్స్​ చేస్తే, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిచెందుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం