Airtel Tariff Hike : భారీగా పెరిగిన ఎయిర్​టెల్​ రీఛార్జ్​ ధరలు.. ఊహించినట్టుగానే!-after jio airtel raises mobile tariffs from july 3 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Airtel Tariff Hike : భారీగా పెరిగిన ఎయిర్​టెల్​ రీఛార్జ్​ ధరలు.. ఊహించినట్టుగానే!

Airtel Tariff Hike : భారీగా పెరిగిన ఎయిర్​టెల్​ రీఛార్జ్​ ధరలు.. ఊహించినట్టుగానే!

Sharath Chitturi HT Telugu

Airtel Tariff Hike new : రీఛార్జ్​ ధరలను పెంచుతున్నట్టు ఎయిర్​టెల్​ సంస్థ ప్రకటించింది. జియో ఇప్పటికే.. ధరలను పెంచేసింది.

రీఛార్జ్​ ధరలను పెంచిన ఎయిర్​టెల్​.. (REUTERS)

ఎయిర్​టెల్​ వినియోగదారులకు అలర్ట్​! రీఛార్జ్​ ధరలను పెంచుతున్నట్టు దిగ్గజ టెలికాం సంస్థ ప్రకటించింది. పెంచిన ధరలు.. జులై 3 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసిది. రిలయన్స్​ జియో సంస్థ.. తమ టారీఫ్​లను పెంచుతున్నట్టు ప్రకటించిన కొన్ని గంటలకే.. ఎయిర్​టెల్​ కూడా ధరల పెంపుపై స్పష్టత ఇచ్చింది.

అయితే.. తాము రీఛార్జ్​ ధరలు పెంచినా, కస్టమర్లపై ఎక్కువ భారం పడకుండా చూసుకున్నామని ఎయిర్​టెల్​ చెప్పింది.

“ఎంట్రీ లెవల్​ ప్లాన్స్​పై ఇప్పుడు ఒక మోస్తారు ధరలు (రోజుకు 70పైసలు) మాత్రమే పెంచాము. ఇది వినియోగదారులపై ఎక్కువ భారాన్ని చూపించదు.”

రీఛార్జ్​ ప్లాన్స్​ ఇలా పెరిగాయి..

2జీబీ డేటా, అన్​లిమెడ్​ కాలింగ్​, రోజుకు 100 ఎస్​ఎంఎస్​లతో 28 రోజుల వాలిడిటీ ఉండే ఎంట్రీ లెవల్ రూ. 179 ఎయిర్​టెల్​ రీఛార్జ్​ ప్లాన్​.. రూ. 199 అయ్యింది. 6జీబీ డేటాతో 84 రోజుల పాటు వచ్చే రూ. 455 ప్లాన్​, ఇప్పుడు రూ. 509 అయ్యింది. ఇక 24జీబీ డేటాతో 365 రోజుల వాలిడిటీతో వచ్చే రూ. 1799 ప్లాన్​.. రూ. 1999 అయ్యింది.

ఇక డైలీ డేటా ప్లాన్స్​ విషయానికొస్తే.. 1జీబీ డేటా, అన్​లిమిటెడ్​ కాలింగ్​, రోజుకు 100 ఎస్​ఎంఎస్​లతో (28 రోజులు) కూడిన రూ. 265 ప్లాన్​ కాస్తా.. రూ. 299 అయ్యింది. 1.58జీబీతో (28 రోజులు) కూడిన రూ. 299 ప్లాన్​ ఇప్పుడు రూ. 349 అయ్యింది. 2.5 జీబీతో (28 రోజులు) కూడిన రూ. 359 ప్లాన్​.. రూ. 409 అయ్యింది. 3జీబీతో వచ్చే రూ. 399 ప్లాన్​ ఇప్పుడు రూ. 449గా మారింది.

ఇక 56 రోజుల పాటు రోజుకు 1.5జీబీ డేటా, అన్​లిమిటెడ్​ కాలింగ్​, రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు ఇచ్చే రూ. 479 ప్లాన్​.. ఎయిర్​టెల్​ రీఛార్జ్​ ధరల పెంపుతో రూ. 579 అయ్యింది. రోజుకు 2జీబీ డేటా ఇచ్చే రూ. 549 ప్లాన్​.. రూ. 649 అయ్యింది.

84 రోజుల పాటు రోజుకు ర1.5జీబీ డేటా, అన్​లిమిటెడ్​ కాలింగ్​, రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు ఇచ్చే రూ. 719 ప్లాన్​ ధర రూ. 859 అయ్యింది. 2జీబీ డేటా ఇచ్చే రూ. 839 ప్లాన్​ ధర ఏకంగా రూ. 979 అయ్యింది.

365 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా, అన్​లిమిటెడ్​ కాలింగ్​, రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు ఇచ్చే రూ. 2999 ప్లాన్​ ఇప్పుడు రూ. 3599 అయ్యింది.

పెంచిన ధరల పూర్తి వివరాలు..

ప్రీపెయిడ్​ ఛార్జీలు..
ప్రీపెయిడ్​ ఛార్జీలు.. (Bharti Airtel)

Updated Post-Paid tariff Plans Below

పోస్ట్​పెయిడ్​ టారీఫ్​ వివరాలు..
పోస్ట్​పెయిడ్​ టారీఫ్​ వివరాలు.. (Bharti Airtel)

రిలయన్స్​ జియో కూడా..

రిలయన్స్ జియో మొబైల్ రీఛార్జ్ ధరలు భారీగా పెంచింది. ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ ధరలు రెండూ పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు జులై 3 నుంచి అమల్లోకి రానున్నట్లు గురువారం ప్రకటించింది. దాదాపు అన్ని ప్లాన్‌లలో మొబైల్ సేవల రేట్లను పెంచింది. దాదాపుగా రెండున్నరేళ్ల తర్వాత జియో మొబైల్ రీఛార్జ్ రేట్లను పెంచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

వాస్తవానికి.. ఎయిర్​టెల్​, జీయో సంస్థలు టారీఫ్​లను పెంచాలని ఎప్పటి నుంచో చూస్తున్నాయి. కానీ.. 2024 లోక్​సభ ఎన్నికల కారణంగా ఇంతకాలం ఆగాయి.

సంబంధిత కథనం