Changes for July 1 : జులై 1 నుంచి ఈ విషయాల్లో కీలక మార్పులు- ఈ డెడ్​లైన్స్​ గురించి తెలుసుకోండి..-6 major financial deadlines rules change in july 2024 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Changes For July 1 : జులై 1 నుంచి ఈ విషయాల్లో కీలక మార్పులు- ఈ డెడ్​లైన్స్​ గురించి తెలుసుకోండి..

Changes for July 1 : జులై 1 నుంచి ఈ విషయాల్లో కీలక మార్పులు- ఈ డెడ్​లైన్స్​ గురించి తెలుసుకోండి..

Sharath Chitturi HT Telugu
Jun 30, 2024 06:40 AM IST

Financial changes from July 1 : ఆర్థిక విషయం పరంగా ఈ జులై 1 నుంచి పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. అంతేకాదు కొన్ని డెడ్​లైన్స్​ కూడా ఉన్నాయి. ఆ వివరాలు..

జులై 1 నుంచి ఈ విషయాల్లో కీలక మార్పులు
జులై 1 నుంచి ఈ విషయాల్లో కీలక మార్పులు (iStock)

నేటితో జూన్​ నెలకు ముగింపు పడనుంది. జులై 1తో కొత్త నెల ప్రారంభంతో పాటు దేశవ్యాప్తంగా పలు కీలక ఆర్థిక విషయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రజలు తెలుసుకోవాల్సిన పలు డెడ్​లైన్​లు సైతం ఉన్నాయి. ఆ వివరాలను ఇక్కడ చూడండి..

ప్రధాన గడువులు..

జూలై 1, 2024: ఎస్​బీఐ కార్డ్​ క్రెడిట్ కార్డు నిబంధనలు, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జీలలో మార్పులు అమల్లోకి వస్తాయి.

జూలై 15, 2024: యాక్సిస్ బ్యాంకుకు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు మైగ్రేషన్ పూర్తి.

జూలై 20, 2024: యాక్టివ్​గా లేని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్లను మూతపడతాయి.

జూలై 31, 2024: 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు చివరి తేదీ.

పేటీఎం వాలెట్ మూసివేత..

నిల్​ బ్యాలెన్స్​ ఉండి ఏడాదికి పైగా ఎలాంటి లావాదేవీలు చేయని వ్యాలెట్లను జూలై 20, 2024న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మూసివేయనుంది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. “గత 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఎటువంటి లావాదేవీలు లేని, బ్యాలెన్స్ లేని అన్ని వ్యాలెట్లను ఇకపై మూసివేయనున్నట్లు దయచేసి గమనించండి. జూలై 20, 2024 చివరి తేదీ. ప్రభావిత వినియోగదారులందరికీ కమ్యూనికేషన్ పంపిస్తాము. వినియోగదారులు వారి వాలెట్​ని మూసివేయడానికి ముందు 30 రోజుల నోటీసు వ్యవధి ఇస్తాము,” అని ఉంది.

ఎస్​బీఐ కార్డ్ క్రెడిట్ కార్డ్ రూల్ మార్పులు..

జూలై 1, 2024 నుంచి ఎస్​బీఐ కార్డ్ అనేక క్రెడిట్ కార్డులకు ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీలపై రివార్డ్ పాయింట్లను పొందడాన్ని నిలిపివేయనుంది. ప్రభావిత కార్డులు:

ఎయిర్ ఇండియా ఎస్​బీఐ ప్లాటినం కార్డు

ఎయిరిండియా ఎస్​బీఐ సిగ్నేచర్ కార్డ్

సెంట్రల్ ఎస్​బీఐ సెలెక్ట్ + కార్డు

చెన్నై మెట్రో ఎస్​బీఐ కార్డ్

క్లబ్ విస్తారా ఎస్​బీఐ కార్డ్

విస్తారా ఎస్​బీఐ కార్డ్ ప్రైమ్

ఢిల్లీ మెట్రో ఎస్​బీఐ కార్డ్

ఎతిహాద్ గెస్ట్ ఎస్​బీఐ కార్డ్

ఎతిహాద్ గెస్ట్ ఎస్​బీఐ ప్రీమియర్ కార్డ్

ఫ్యాబ్ఇండియా ఎస్​బీఐ కార్డ్ సెలెక్ట్​

ఐఆర్​సీటీసీ ఎస్​బీఐ కార్డ్

ఐఆర్​సీటీసీ ఎస్​బీఐ కార్డ్ ప్రీమియర్

ముంబై మెట్రో ఎస్​బీఐ కార్డ్

నేచర్స్ బాస్కెట్ ఎస్​బీఐ కార్డ్

నేచర్స్ బాస్కెట్ ఎస్​బీఐ కార్డ్ ఎలైట్

ఓలా మనీ ఎస్​బీఐ కార్డ్

పేటిఎం ఎస్​బీఐ కార్డ్

రిలయన్స్ ఎస్​బీఐ కార్డ్

రిలయన్స్ ఎస్​బీఐ కార్డ్ ప్రైమ్

యాత్ర ఎస్​బీఐ కార్డ్ సెలెక్ట్​

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జీల సవరణలు..

జూలై 1, 2024 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ వివిధ క్రెడిట్ కార్డ్ సర్వీస్ ఛార్జీలలో మార్పులను అమలు చేస్తుంది. ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్ క్రెడిట్ కార్డు మినహా అన్ని కార్డులకు కార్డు రీప్లేస్​మెంట్ ఫీజును రూ.100 నుంచి రూ.200కు పెంచడం గమనార్హం. అదనంగా, ఈ క్రింది రుసుము నిలిపివేయనుంది..

చెక్/క్యాష్ పికప్ ఫీజు రూ.100 పిక్ అప్

ఛార్జ్ స్లిప్ రిక్వెస్ట్ ఫీజు రూ.100

డయల్-ఎ-డ్రాఫ్ట్ లావాదేవీ రుసుము డ్రాఫ్ట్ విలువలో 3 శాతం, కనీసం రూ.300

కనీసం రూ. 100తో కూడిన 1 శాతం చెక్​ వాల్యూపై అవుట్​ స్టేషన్​ చెక్​ ప్రాసెసింగ్​ ఫీజు

3 నెలలు దాటిన డూప్లికేట్​ స్టేటమెంట్​ రిక్వెస్ట్​ ఫీజు రూ. 100

ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్) గడువు..

2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను (అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ 2024 జూలై 31. ఈ గడువును కోల్పోయిన పన్ను చెల్లింపుదారులు డిసెంబర్ 31, 2024 లోగా ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేయవచ్చు.

పీఎన్​బీ రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ మార్పులు..

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్​బీ) జూలై 1, 2024 నుంచి అమల్లోకి వచ్చే అన్ని రూపే ప్లాటినం డెబిట్ కార్డు వైవిధ్యాల కోసం లాంజ్ యాక్సెస్ ప్రోగ్రామ్​లో మార్పులను ప్రకటించింది. అప్​డేటెడ్ బెనిఫిట్స్:

  • ప్రతి త్రైమాసికానికి ఒక డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ లేదా రైల్వే లాంజ్ యాక్సెస్
  • సంవత్సరానికి రెండు అంతర్జాతీయ ఎయిర్​పోర్ట్ లాంజ్ యాక్సెస్​లు
  • సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మైగ్రేషన్

యాక్సిస్ బ్యాంక్ జూలై 15, 2024 నాటికి క్రెడిట్ కార్డ్ సంబంధాలతో సహా అన్ని ఖాతాలను మైగ్రేట్ చేస్తామని సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు తెలియజేసింది.

హీరో మోటోకార్ప్​ ధరల పెంపు..

కస్టమర్లకు షాక్​ ఇస్తూ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హీరో మోటోకార్ప్​.. తమ వాహనాల ధరలను పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది. పెంచిన ధరలు జులై 1, 2024 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

వీటితో పాటు ఎయిర్​టెల్​, జీయో, వోడాఫోన్​ఐడియాలు తీసుకున్న టారీఫ్​ హైక్​.. జులై మొదటి వారంలో అమల్లోకి వస్తాయి.

Whats_app_banner

సంబంధిత కథనం