5ఏళ్లల్లో 4000శాతం పెరిగిన మల్టీబ్యాగర్​ స్టాక్​- ఇప్పుడు బిగ్​ అప్డేట్​తో జంప్​!-4000 percent in five years multibagger stock jumps 5 on bagging orders from railways ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  5ఏళ్లల్లో 4000శాతం పెరిగిన మల్టీబ్యాగర్​ స్టాక్​- ఇప్పుడు బిగ్​ అప్డేట్​తో జంప్​!

5ఏళ్లల్లో 4000శాతం పెరిగిన మల్టీబ్యాగర్​ స్టాక్​- ఇప్పుడు బిగ్​ అప్డేట్​తో జంప్​!

Sharath Chitturi HT Telugu

5ఏళ్లల్లో 4000శాతం పెరిగిన మల్టీబ్యాగర్​ స్టాక్​ అయిన హెచ్​బీఎల్​ ఇంజినీరింగ్​.. సోమవారం భారీగా పెరిగింది. దీనికి కారణాలు ఉన్నాయి. పూర్తి వివరాలు..

మల్టీబ్యాగర్​ స్టాక్​ నుంచి బిగ్​ అప్డేట్​.. (Image: Pixabay)

భారత స్టాక్​ మార్కెట్​లోని మల్టీబ్యాగర్​ స్టాక్స్​లో హెచ్​బీఎల్​ ఇంజినీరింగ్​ ఒకటి. ఈ స్టాక్​ 5ఏళ్లల్లో 4000శాతానికిపైగా పెరిగింది. ఇక ఇప్పుడు, ఇజ్రాయెల్​ ఇరాన్​ ఉద్రిక్తతల మధ్య దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఒడుదొడుకులకు గురవుతున్నప్పటికీ, హెచ్​బీఎల్​ ఇంజినీరింగ్​ స్టాక్​ సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో 5శాతం వృద్ధిచెందింది. ఒక కీలక అప్డేట్​ ఉండటం ఇందుకు కారణం.

మల్టీబ్యాగర్​ హెచ్​బీఎల్​ ఇంజినీరింగ్​ స్టాక్​ అప్డేట్​..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో మల్టీబ్యాగర్ స్టాక్ అయిన హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ షేర్లు బీఎస్‌ఈలో 5.04% పెరిగి రూ. 619.75కు చేరుకున్నాయి. అక్కడి నుంచి కాస్త పడి, ఉదయం 11:30 సమయంలో రూ. 598 వద్ద ట్రేడ్​ అవుతోంది.

రెండు ప్రాజెక్టుల కోసం దక్షిణ మధ్య రైల్వే నుంచి లెటర్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ (LoA) అందుకున్నట్లు హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ వారాంతంలో ప్రకటించడంతో స్టాక్​ పెరిగింది.

మొదటి ప్రాజెక్ట్ కింద విజయవాడ-బల్లార్‌షా సెక్షన్‌లోని 446 కిలోమీటర్ల ట్రాక్, 10 లోకోమోటివ్‌లు, 48 స్టేషన్లలో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్‌కు దక్షిణ మధ్య రైల్వే ఎల్​ఓఏ జారీ చేసింది. ఈ కాంట్రాక్టును 18 నెలల్లో పూర్తి చేయాలని హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ జూన్ 14న రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ కాంట్రాక్టు మొత్తం విలువ రూ. 132.95 కోట్లు (18% జీఎస్‌టీతో కలిపి) అని పేర్కొంది.

అదనంగా, ముద్​ఖేడ్ సెక్షన్ పరిధిలోని 350 కి.మీ.ల ట్రాక్‌లో కవచ్ వెర్షన్ 3.2ను వెర్షన్ 4.0కు అప్‌గ్రేడ్ చేయడానికి (ముద్​ఖేడ్​తో కలిపి) కూడా దక్షిణ మధ్య రైల్వే కంపెనీకి ఎల్​ఓఏ జారీ చేసింది. ఈ కాంట్రాక్టును 24 నెలల్లో పూర్తి చేయాలి, దీని మొత్తం విలువ రూ. 30.67 కోట్లు (18% జీఎస్‌టీతో కలిపి) అని కంపెనీ జూన్ 15న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ తన మొత్తం ఆర్డర్ బుక్ రూ. 4,029.05 కోట్లు అని తెలిపింది.

హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ షేర్ ప్రైజ్​ హిస్టరీ..

గత మూడు నెలల్లో హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ షేర్ ధర 45% పెరిగింది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు 5% తగ్గింది. సంవత్సర కాలంలో, ఈ స్టాక్ 26% లాభపడింది. ముఖ్యంగా, గత రెండేళ్లలో హెచ్‌బీబీఎల్ ఇంజినీరింగ్ షేర్ ధర 316% మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. కాగా, గత ఐదేళ్లలో మాత్రం ఏకంగా 4,000% పెరిగింది.

కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 16,662 కోట్లకు పైగా ఉంది. డిజైనింగ్​, మేన్యుఫ్యాక్చరింగ్​, పవర్​ సొల్యూషన్స్​ సప్లైలో ఈ కంపెనీ పనిచేస్తుంది. దీనిని 1977లో స్థాపించరు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు మీరు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించాల్సి ఉంటుంది.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం