Upcoming SUV : మార్కెట్‌లోకి దూసుకొచ్చేందుకు చూస్తున్న 3 మైక్రో ఎస్‌యూవీలు.. ఇదిగో పూర్తి వివరాలు-3 micro suv is preparing to strong enty in the market hyundai exter ev maruti suzuki tata punch face lift ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Upcoming Suv : మార్కెట్‌లోకి దూసుకొచ్చేందుకు చూస్తున్న 3 మైక్రో ఎస్‌యూవీలు.. ఇదిగో పూర్తి వివరాలు

Upcoming SUV : మార్కెట్‌లోకి దూసుకొచ్చేందుకు చూస్తున్న 3 మైక్రో ఎస్‌యూవీలు.. ఇదిగో పూర్తి వివరాలు

Anand Sai HT Telugu
Oct 27, 2024 10:00 PM IST

Upcoming SUV : భారతీయ మార్కెట్‌లోకి దూసుకొచ్చేందుకు మూడు మైక్రో ఎస్‌యూవీలు చూస్తున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా ఉంది. ఆ వివరాలేంటో చూద్దాం..

హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు
హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు

గత కొన్నేళ్లుగా భారతీయ వినియోగదారులలో మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కార్లకు ఆదరణ పెరుగుతోంది. అయితే టాటా పంచ్ ప్రస్తుతం ఈ విభాగంలో ఆధిపత్యం కొనసాగిస్తోంది. గత నెలలో అంటే 2024 సెప్టెంబర్ నెలలోనే టాటా పంచ్ 13,711 యూనిట్ల ఎస్‌యూవీలను విక్రయించింది. అంతేకాక టాటా పంచ్ 2025 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా నిలిచింది.

మీరు కూడా సమీప భవిష్యత్తులో కొత్త మైక్రో ఎస్‌యూవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే మీ కోసం గుడ్‌న్యూస్ ఉంది. మారుతి సుజుకి నుండి భారతదేశంలో అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ హ్యుందాయ్ ఇండియా వరకు రాబోయే రోజుల్లో 3 కొత్త మైక్రో ఎస్‌యూవీలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రాబోయే మైక్రో ఎస్‌యూవీలో ఎలక్ట్రిక్ మోడల్ కూడా ఉంది.

మారుతి సుజుకి మైక్రో ఎస్‌యూవీ

దేశంలో అతిపెద్ద కార్ల విక్రయదారు మారుతి సుజుకి కొత్త మైక్రో ఎస్‌యూవీని రూపొందించే పనిలో ఉంది. వార్తా వెబ్సైట్ గాడివాడిలో ప్రచురితమైన ఒక వార్త ప్రకారం, రాబోయే మారుతి మైక్రో ఎస్‌యూవీ మార్కెట్లో టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌తో పోటీపడుతుంది. రాబోయే మారుతి మైక్రో ఎస్‌యూవీ అంతర్గత కోడ్ నేమ్ వై 43గా ఉంటుందని తెలుస్తోంది. రాబోయే మారుతి మైక్రో ఎస్‌యూవీని 2026-27 మధ్య విడుదల చేయవచ్చని నివేదికలు చెబుతున్నాయి.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఈవీ

హ్యుందాయ్ ఇండియా తన పాపులర్ ఎస్‌యూవీ ఎక్స్‌టర్ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను రాబోయే రోజుల్లో విడుదల చేయాలని యోచిస్తోంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఈవీ టాటా పంచ్ ఈవీ, ఎంజీ కామెట్ ఈవీ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. 2026 సంవత్సరంలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఈవీని కంపెనీ లాంచ్ చేయవచ్చని పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఈవీలో వినియోగదారులు 40 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ను పొందవచ్చు. ఇది సుమారు 350 నుండి 400 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.

టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్

టాటా మోటార్స్ తన పాపులర్ ఎస్‌యూవీ పంచ్‌పై వచ్చే ఏడాది అంటే 2025లో ఒక అప్‌డేట్‌ను అందించాలని భావిస్తోంది. ఇటీవల కంపెనీ టాటా పంచ్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో వినియోగదారులు 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీల పార్కింగ్ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను పొందుతుందని పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ కారు పవర్ట్రెయిన్లో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు.

Whats_app_banner