బడ్జెట్ ధరలోనే వచ్చే మూడు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. సింగిల్‌ ఛార్జ్‌తో సూపర్ రేంజ్ కూడా!-3 best electric cars under budget price also have super range with single charge ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  బడ్జెట్ ధరలోనే వచ్చే మూడు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. సింగిల్‌ ఛార్జ్‌తో సూపర్ రేంజ్ కూడా!

బడ్జెట్ ధరలోనే వచ్చే మూడు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. సింగిల్‌ ఛార్జ్‌తో సూపర్ రేంజ్ కూడా!

Anand Sai HT Telugu

ఎలక్ట్రిక్ కార్లు ఇటీవలి కాలంలో భారత మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. చాలా మంది వీటిని కొనేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. మీకు కూడా ఈ ప్లాన్ ఉంటే రూ.10 లక్షలలోపు ఈవీ గురించి చూద్దాం..

ఎంజీ కామెట్ ఈవీ

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణ అనుకూలం దీనికి కారణం. చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలపై సందేహంతో ఉంటున్నారు. భారతదేశంలో బాగా అమ్ముడవుతున్న రూ.10 లక్షల లోపు ధర గల ఈవీ కార్లు ఉన్నాయి. అవేంటో చూసేద్దాం..

ఎంజీ కామెట్ ఈవీ

ఎంజీ కామెట్ ఈవీ నగరంలో, చుట్టుపక్కల రోజువారీ ప్రయాణాలకు తగిన కారు. ఎంజీ కామెట్ ఈవీ భారతదేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు. దీని ధరలు రూ. 7.98 లక్షల నుండి రూ. 9.98 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇది 17.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో వెనుక భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. కామెట్ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కి.మీ రేంజ్ ప్రయాణించగలదు. దీని బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్(BAS) ఆప్షన్‌కో వస్తుంది. ఎంజీ కామెట్ ఈవీ కాంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉంది. నగర ట్రాఫిక్‌లో కూడా సులభంగా నడపడానికి వీలు కల్పిస్తుంది.

టాటా టియాగో ఈవీ

టాటా టియాగో ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కి.మీ రేంజ్ వెళ్తుంది. ఇది రోజువారీ ప్రయాణాలకు బాగుంటుంది. టాటా టియాగో ఈవీ భారతదేశంలో రెండో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు. రూ.7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో కొనుగోలుకు అందుబాటులో ఉంది. టాటా టియాగో ఈవీ కాంపాక్ట్ డిజైన్‌తో వస్తుంది. ఇది ఎంజీ కామెట్‌తో నేరుగా పోటీపడుతుంది.

టాటా పంచ్ ఈవీ

టాటా పంచ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. 25 kWh, 35 kWh. 35 kW వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 365 కి.మీ రేంజ్ ప్రయాణించగలదు. 25 kW వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 265 కి.మీ రేంజ్ అందిస్తుంది. టాటా పంచ్ ఈవీ బేస్ మోడల్ ధర రూ.9.99 లక్షలు, టాప్ మోడల్ ధర రూ. 14.44 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కొన్ని నెలల్లో పంచ్ ఈవీ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా ఉంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.