2025 హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 మోటార్సైకిల్ను కంబాట్ అనే కొత్త వేరియంట్తో పరిచయం చేశారు. ఇది బేస్, టాప్ వేరియంట్లలో కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉంది. ఈ బైక్ ధర రూ. 1.81 లక్షలు, రూ. 2.01 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 మోటార్ సైకిల్ డిజైన్లో ఎటువంటి ముఖ్యమైన మార్పులు జరగలేదు. ఇది అద్భుతమైన ఎల్ఈడీ హెడ్లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్లు, మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, స్ప్లిట్ సీట్ సెటప్ను కలిగి ఉంది. కొత్త కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 బేస్, టాప్ వేరియంట్లు ఐకానిక్ ఎల్లో, టర్బో రెడ్, మ్యాట్ ఫాంటమ్ బ్లాక్ రంగులలో కూడా అందుబాటులో ఉన్నాయి. దీనితో ఈ మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే అందరి దృష్టి మీ మీదే ఉంటుంది.
కొత్త హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 బైక్ మరింత శక్తివంతమైన 210సీసీ, సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ను పొందుతుంది. ఇది 9,250 ఆర్పీఎమ్ వద్ద 25.15 బీహెచ్పీ హార్స్పవర్, 7,250 ఆర్పీఎమ్ వద్ద 20.4 ఎన్ఎం (న్యూటన్ మీటర్) పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్బాక్స్ కూడా ఉంది.
ఈ హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 మోటార్ సైకిల్ అనేక ఆకర్షణీయమైన లక్షణాలతో వస్తుంది. ముఖ్యంగా ఇది స్మార్ట్ఫోన్ కనెక్టివిటీతో 4.2-అంగుళాల టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ను పొందుతుంది. ఇది కాల్, ఎంఎంఎస్ హెచ్చరికలను కూడా అందిస్తుంది. కొత్త బైక్లో ముందు భాగంలో అప్సైడ్-డౌన్ ఫోర్క్ సస్పెన్షన్ సెటప్ ఆప్షన్ ఉంది. రైడర్ రక్షణ కోసం దీనికి డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. ఇది డ్యూయల్-ఛానల్ ఏబీఎస్(యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్)ని కలిగి ఉంది. రోడ్డుపై గట్టి పట్టును అందించడానికి 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ను పొందుతుంది.
కొత్త హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 మోటార్ సైకిల్ విడుదల యూత్కి తెగ నచ్చేస్తుంది. ఇది ఆకర్షణీయమైన డిజైన్, లక్షణాలతో ఉంటుంది. రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో యూత్ దీనిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.
సంబంధిత కథనం
టాపిక్