సిప్‌లో వేలల్లో పెట్టుబడితో కోట్లు రిటర్న్.. ఈ క్యాలిక్యులేషన్ చూడండి-10000 rupees sip investment can give good returns in future heres calculations ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  సిప్‌లో వేలల్లో పెట్టుబడితో కోట్లు రిటర్న్.. ఈ క్యాలిక్యులేషన్ చూడండి

సిప్‌లో వేలల్లో పెట్టుబడితో కోట్లు రిటర్న్.. ఈ క్యాలిక్యులేషన్ చూడండి

Anand Sai HT Telugu

మ్యూచువల్ ఫండ్స్ సిప్‌లలో పెట్టుబడి పెట్టడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. చాలా మంది చిన్న వయసులోనే పెట్టుబడి పెడుతున్నారు. మీరు కూడా రూ.10 వేలతో కోట్లు పొందవచ్చు.

సిప్ పెట్టుబడి

పెట్టుబడి పెట్టడానికి కూడా ఓపిక చాలా అవసరం. క్రమబద్ధమైన పెట్టుబడి వ్యూహానికి ఓర్పు, క్రమశిక్షణ చాలా కావాలి. సిప్‌లు నెమ్మదిగా, స్థిరమైన ప్రయోజనాలను అందిస్తాయి. సిప్ ద్వారా కాలక్రమేణా మీ పెట్టుబడులను వైవిధ్యపరచవచ్చు, తద్వారా మీరు మార్కెట్ హెచ్చుతగ్గుల నుండి రక్షణ పొందవచ్చు, మీ డబ్బును రక్షించుకోవచ్చు.

రూ.10వేల సిప్

ఉదాహరణకు ఒక పెట్టుబడిదారుడు 25 సంవత్సరాల వయస్సులో ప్రతి నెలా రూ.10,000 సిప్‌లో పెట్టుబడి పెడితే 60 సంవత్సరాల వయస్సు వరకు ఓపికగా వేచి ఉండాలి. 12 శాతం వడ్డీ అంచనా వేయాలి. కచ్చితంగా ప్రతి నెలా పెట్టుబడి పెట్టాలి. ఈ విధంగా నిర్వహిస్తే పెట్టుబడిదారుడి 60 సంవత్సరాల వయస్సు నాటికి సిప్ మెుత్తం మొత్తం 5.51 కోట్లు అవుతుంది. పెట్టుబడి పెట్టిన మెుత్తం రూ.42,00,000. అంటే అతని ఓర్పు అతని సంపద అని అర్థం.

రూ.20 వేల సిప్

మరొక వ్యక్తి 35 సంవత్సరాల వయస్సులో రూ.20,000 సిప్ ప్రారంభిస్తే అతను 60 సంవత్సరాల వయస్సులో రూ.4.25 కోట్లు సంపాదిస్తాడు. పెట్టుబడి పెట్టిన మెుత్తం రూ.75,00,000. పెట్టుబడి పెట్టడంలో సమయమే ప్రధాన మంత్రం అని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కేవలం డబ్బు మొత్తం కాదు, కాలం కూడా అత్యధిక ఫలితాలను ఇస్తుంది.

ఓపికతోనే రాబడులు

సిప్‌లు కాలక్రమేణా పెట్టుబడి మొత్తాన్ని పెంచుతూనే ఉంటాయి. చాలా కాలం పాటు సిప్‌లను కొనసాగించడం ద్వారా, మీరు ప్రతి దశలో విలువను పెంచుకోవచ్చు. సిప్‌ పెట్టుబడిలో విజయం సాధించడానికి మీరు క్రమశిక్షణ, సహనాన్ని అనుసరించాలి. ధైర్యం, కృషి, సమయంతో నిర్వహణలో పెట్టుబడి పెట్టడం కొనసాగించాలి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.